జబర్దస్త్.. ఈ టీవీ ప్రోగ్రామ్ పేరు తెలియని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు.. అంతగా పాపులర్ అయ్యిందీ షో.. ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో అందులో నటీనటులు కూడా సెలబ్రెటీ స్టేటస్ సంపాదించుకున్నారు. 


ఈ షోలో ఆర్టిస్టులకు షో జడ్జీలుగా ఉన్న నాగబాబు, రోజాలతో చాలా అనుబంధం ఉంది. అందులోనూ ఈ షోలో ఆర్టిస్టుల్లో ఎక్కువగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ. అందుకేనేమో వారంతా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి తరలివెళ్లారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం అసెంబ్లీ స్థానానికి.. ఆయన అన్నయ్య నాగబాబు నరసాపురం ఎంపీకి పోటీచేయడంతో వారికి ఓటేయమంటూ ఈ జబర్దస్త్ నటీనటులంతా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై జనం మాత్రం చిత్రవిచిత్రమైన కామెంట్లు చేస్తున్నారు. 

రోజూ జబర్దస్త్ లో పంచ్‌లు వేసే నటులకే దిమ్మతిరిగేలా జనం వీరికి పంచ్ లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రచారంలో వరలక్ష్మి అనే మహిళ.. తాను జనసేనకు ఓట్లేయిస్తానని.. తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలంటూ హైపర్ ఆదికి కౌంటర్ పంచ్ వేసింది. జనం ఇంత ఫాస్ట్ గా ఉంటారని జబర్దస్త్ టీమ్‌ ఇలాంటి సిట్యుయేషన్లలో నోరు వెళ్లబెట్టాల్సి వస్తోందట. మరి వీరి ప్రచారం జనసేనకు ఏమాత్రం ఓట్లు రాలుస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: