గురు, శుక్రవారాల్లో టీవీల్లో నవ్వుల వర్షం కురిపించే జబర్దస్త్ టీమ్ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇల్లిళ్లూ తిరుగుతోంది. బాబు పవన్ కల్యాణ్‌కే మీ ఓటు.. నాగబాబుకే మీ ఓటూ అంటూ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. దాదాపు టీమ్ అంతా అక్కడే మకాం వేసింది. 

జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు నాగబాబు జడ్డి కావడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు ఈ టీమ్‌లో చాలామంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా అందుకే తమ అభిమాన నాయకుల కోసం ఓట్ల పాట్లు పడుతున్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్టు కూడా ఉంది. 


ఇదే జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో మరో న్యాయ నిర్ణేతగా నటి రోజా ఉన్నారు. ఆమె కూడా నగరి అసెంబ్లీ సీటు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ ఆమె తరపున ఒక్క నటుడు కూడా నగరిలో పర్యటించడం లేదు. అంతా నాగబాబు వెనుకే తిరుగుతున్నారు. 

పాపం.. జబర్దస్‌ ప్రోగ్రామ్‌లో రోజా ఆహా..ఓహో.. అంటూ బిస్కట్లు వేసే నటీనటులు రాజకీయం ప్రచారం విషయంలో మొహం చాటేయడం ఆసక్తి రేపుతోంది. ఇద్దరు జడ్జిల్లో  పూర్తిగా ఒక్కరి వైపే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: