గుడివాడ అభ్యర్థి కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇన్నాళ్లూ ఆయన వైఫల్యాలపై ప్రసంగించిన నాని ఇప్పుడు డైరెక్టుగా ఆయన మానసిక స్థితిపైనా సెటైర్లు వేస్తున్నారు. 


గుడివాడకు మెడికల్ కాలేజీ, నాలుగు లైన్ల రోడ్డు, బస్టాండ్‌ , రింగ్ రోడ్డు చేయిస్తానని గుడివాడకు వచ్చి చంద్రబాబు చెప్పడాన్ని కొడాలి నాని.. తప్పుబట్టారు. చంద్రబాబుకు అల్జీమర్స్ అనే వ్యాధి వచ్చింది. దీని ప్రకారం ఆయనకు ఏదీ గుర్తుండటం లేదు.. అంటూ కౌంటర్ వేశారు. 

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గుడివాడకు కనీసం జూనియర్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు కొడాలి నాని. నమ్మినవారి పట్ల చంద్రబాబు చాలా ప్రమాదకరంగా వ్యవహరిస్తారని తెలిపారు. నమ్మినవారికి వెన్నుపోటు పొడవటం చాలా అలవాటు అంటూ దుమ్మెత్తిపోశారు. 

చంద్రబాబును నమ్మడం చాలా ప్రమాదకరం అంటూ గుడివాడ ప్రజలకు వివరిస్తున్నారు కొడాలి నాని. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదన్న నాని.. జగన్‌ను గెలిపిస్తే నవరత్నాల పథకాల్లో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాడని వివరించారు. దేవినేని అవినాశ్‌ ను గుడివాడలో పోటీ పెట్టి అతన్ని బలి చేస్తున్నారని నాని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: