ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ గుడ్ న్యూస్.. ఆయన్ను ప్రధాన విలన్‌గా చూపించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమా ఇక ఎన్నికలకు ముందు విడుదలయ్యే అవకాశాలు దాదాపుగా లేవు.. ఏపిలో హైకోర్టు న్యాయమూర్తులు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.సినిమా చూడకుండానే కేసును వాయిదా వేసేశారు. 


ఎందుకంటే.. సుప్రింకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున సినిమా చూడడం లేదని కోర్టు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ కేసును తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు. ఈ సినిమా ఇప్పటికే తెలంగాణ సహా ప్రపంచమంతా విడుదలైంది. ఎపిలో విడుదల కాలేదు. 

సెన్సార్ బోర్డు వారు అనుమతి ఇచ్చిన తర్వాత హైకోర్టు వారు ఆపడంపై విమర్శలు వస్తున్నాయి. హైకోర్టు మొన్న  మూడో తారీఖు సినిమా చూస్తామని చెప్పింది. ఇంతలోనే.. సుప్రింకోర్టుకు వెళ్లారు కనుక చూడం అని ఇప్పుడు చెబుతోంది. మొత్తానికి ఈ సినిమా విడుదల ఆపడంలో చంద్రబాబు సక్సస్ అయ్యారు. ఇక రామ్ గోపాల్ వర్మకు సుప్రీంకోర్టు ఒక్కటే దిక్కు. 



మరింత సమాచారం తెలుసుకోండి: