విజయవాడ నగరంలో పలు దేవాలయాలు మసీదులు చర్చీలను దౌర్జన్యంగా కూల్చివేసిన టిడిపి ప్రభుత్వంపై,  ఆయా మతాలపై విశ్వాసం ఉన్న వ్యక్తులు మత గురువులు ఇప్పుడు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవద్దని ఘంటాపధంగా చెపుతున్నారు. అధికారం అండతో ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పేట్రేగి పోయిందని హిందూ, ముస్లిం, క్రైస్తవుల మనోభావాలని దెబ్బతీస్తూ వారి ప్రార్థనా మందిరాలను అడ్డగోలుగా కూల్చివేసిందని పలువురు మత గురువులు ఆరోపించారు. ఇప్పుడు ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు సిద్ధమైందని ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే తరుణం వచ్చిందన్నారు.

temples mosques churches demolition in Vijayawada AP కోసం చిత్ర ఫలితం

ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల మంచి చెడుల గురించి ఆలోచించే పార్టీకి ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. విజయవాడలో గత సోమవారం ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యోగా గురు బాబా పాండురంగం, కపాలానంద స్వామి, బిషప్‌ కాటూరి ప్రభుదాస్, ముస్లిం మత గురువులు అబ్దుల్‌ కరీమ్‌ రిజ్వీ, సయ్యద్‌ ఖలీల్‌ అహ్మద్‌ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాజ్యంగబద్ధంగా అన్నివర్గాలను సమదృష్టితో చూస్తూ పరిపాలన చేయాల్సిన టీడీపీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లు గా హిందూ, ముస్లిం, క్రైస్తవుల పట్ల లెక్కలేనితనాన్ని, చులకన భావాన్ని ప్రదర్శించిందని ఆరోపించారు.

temples mosques churches demolition in Vijayawada AP కోసం చిత్ర ఫలితం

ముఖ్యంగా విజయవాడలో పుష్కరాల పేరిట 43 దేవాలయాలు కూల్చివేసిందని పేర్కొన్నారు. దీని వెనుక విజయవాడ టీడీపీ ఎంపీ కేశినాని శ్రీనివాస్‌ (నాని) హస్తం ఉంద న్నారు. అలాగే పవిత్ర ముస్లిం దర్గా పై దుర్గగుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని చేపట్టవద్దన్నా ఎంపీ నాని ఒత్తిడితో దాన్ని పూర్తి చేస్తున్నారని తెలిపారు. అలాగే బీఆర్‌టీఎస్‌ రోడ్డు లోని ఒక చర్చిని కూలగొట్టి కనీసం మరోచోట నిర్మించడానికి ముందుకు రాలేదని వివరించారు. ఇలా అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ తీరును తీవ్రంగా పరి గణిస్తున్నామని అన్నారు.


పైగా ఇన్నేళ్లు బీజేపీతో అంటకాగి బయటకొచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలొచ్చేసరికి ప్రతిపక్ష వైసిపికి బీజేపీతో పొత్తు ఉన్నట్లు ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. టీడీపీ కుట్రలను అన్నివర్గాలవారు గమనించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేసే పార్టీకి ఓటు వేయాలని మత గురువులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

temples mosques churches demolition in Vijayawada AP కోసం చిత్ర ఫలితం

మసీదులు, దర్గాలను కూల్చేవారికి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఓటు వేయకపోయినా నష్టమే జరుగుతుంది కాబట్టి కచ్చితంగా అందరూ ఓటు హక్కును వినియోగించు కోవాలి. రాష్ట్రాభివృద్ధికోసం పాటుపడేవారిని ఎన్నుకోండి. అని అబ్దుల్‌ కరీమ్‌ రిజ్వీ, ముస్లిం మతగురువు అన్నారు.


"కేశినేని కో హఠావో.. బెజవాడ కో బచావో!" రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోసం విజయవాడ ఎంపీ కేశినేని నాని దేవాలయాలను కూల గొట్టించారు. ఇలాంటి వారికి పతనం తప్పదు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయి కాబట్టి మళ్లీ కుటిల రాజకీయా లకు యత్నిస్తున్నారు. మా మనోభావలను దెబ్బతీసిన వారిని మేము ఎన్నటికీ మర్చిపోలేదు. రాజధాని ప్రాంతం విజయవాడలో అన్నివర్గాలు ప్రశాంతంగా జీవించాలన్నాబెజవాడను రక్షించాలన్నాఈ ఎన్నికల్లో ‘కేశినేని కో హఠావో.. బెజవాడ కో బచావో’ అనే నినాదంతో ప్రజలు ఓట్లు వేయాలి అని– బాబా పాండురంగం, యోగ గురు


క్రైస్తవులు, ముస్లింలు, హిందువులకు నష్టం కలిగించిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కారుస్తూ మళ్లీ ఓట్లు అడిగేందుకువస్తున్నారు విజయవాడలో బీఆర్‌టీఎస్‌ రహదారిలోని ఓ చర్చిని పాలకులు అన్యాయంగా కూల్చివేశారు. దానిని మరో చోట నిర్మించాలని కోరినా మొండివైఖరి చూపారు. అధికార పార్టీ నాయకుడెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి బాధ్యత కలిగిన, నిర్దిష్టమైన ఆలోచనలు కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. – అని– కాటూరి ప్రభుదాస్‌ యాదవ్, బిషప్‌

kesineni nani role in Temples demolition in vijayawada కోసం చిత్ర ఫలితం

ఏడు కొండలు, కనకదుర్గను రక్షించేవారికే ఓటు వేయండి  త్రిపురలో ఉండే నేను ఇక్కడకు వచ్చి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే తెలుగు కూడా నేర్చుకున్నా. నాలుగు నెలల కిందట విజయవాడకు వచ్చి వెళ్లాను. ఈ రాష్ట్రంలో మనందరికీ తెలిసినవాడు ఏడు కొండలవాడు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. పైగా అర్చకులకు అరకొర వేతనాలు ఇస్తున్నారు. కొందరికీ అసలే లేవు. ఏడు కొండల స్వామిని, కనక దుర్గను రక్షించే వారికే ఓటు వేయాలి అని. కపాలనంద స్వామి, హిందూ మతగురువు


టీడీపీ అరాచకాలను ముస్లింలు మర్చిపోరు విభజన తర్వాత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును ప్రజలు గద్దెనెక్కించారు. ఈ ఐదేళ్లలో జరిగినన్ని అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలు మరెప్పుడూ జరగలేదు. పుష్కరాలను అడ్డుపెట్టుకుని దేవాలయాలు, మసీదులు, చర్చిలను కూలగొట్టారు. రామవరప్పాడులో ముస్లింల దర్గాను కూల్చివేశారు. ఆ ఘటనను ముస్లింలు ఎవ్వరూ మర్చిపోలేరు అని – సయ్యద్‌ ఖలీల్‌ అహ్మద్‌ రిజ్వీ, ముస్లిం మతగురువు


మరింత సమాచారం తెలుసుకోండి: