బాలకృష్ణ ఇంకా తన పద్దతిని మార్చుకోవటం లేదు. తమ కార్యకర్తలను కూడా బండ బూతులను తిట్టడం అందరిని కొట్టడం షరామామూలే అయిపొయింది. పట్టుమని వారం రోజులు కూడా పోలింగ్ కు లేదు. ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో మీకు మెజార్టీ పెరుగుతుంది సర్ అంటూ.. అభిమానులు ఆయనను ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తే... బాలయ్య అర్ధం చేసుకోకుండా మూర్ఖంగా వారిని మాత్రం తిట్టిపోసారు. 


ఇక అసలు విషయానికి వస్తే .. బాలయ్య తన భార్య వసుంధరతో కలిసి హిందూపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు బాలయ్య . ఈ క్రమంలో ఈ సారి ఎన్నికల్లో 60వేలు, 70వేలు మెజార్టీ రావడం పక్కా అంటూ అభిమానులు ఆయనతో అన్నారు. వాళ్ళు అన్నది కేవలం 60, 70 వేల ఓట్లు మాత్రమే వస్తాయని అన్నట్టుగా తీసుకుని అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. 


గెలవడమే కష్టంగా ఉందని, వేలు లక్షల మెజారిటీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బాలకృష్ణ మండిపాటుకు గురయ్యారు. . మరో కార్యకర్త సర్‌ 60 వేలు, 70 వేలు మెజారిటీ సర్‌ అంటూ అరవడంతో.. అరే, నీ పేరు అడ్రస్‌ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపడదొబ్బుతా అంటూ అనరాని మాటలు అన్నారు. దీంతో అవాక్కవ్వటం అక్కడ ఉన్న సొంత పార్టీ నేతల వంతు అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: