ఇటీవల వైసీపీ పార్టీలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చేరడం గురించి చంద్రబాబు మాట్లాడుతూ తితిలి తుఫాను వచ్చినప్పుడు వీరంతా ఎక్కడికి వెళ్లారండి అంటూ ప్రశ్నలు వేస్తూ పార్టీలోకి వచ్చిన ఆలీ జయసుధ మరియు మిగతా సినీనటులపై చంద్రబాబు చేసిన కామెంట్స్ పై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా బాబు తలెత్తుకోలేని కౌంటర్లు వేశారు.


‘‘జయసుధ, ఆలీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎలా చేరతారు?తిత్లీ తుఫాన్ వచ్చినపుడు వాళ్లిద్దరు ఎక్కడికెళ్లారని ప్రశ్నిస్తున్నారంటే మీకు నిజంగా ఏదో అయినట్లే ఉంది చంద్రబాబూ?వంద కోట్ల టిటిడి నిధులను దోచిపెట్టిన కె.రాఘవేంద్రరావు, బి.ఎ బాధితులను పరామర్శించాడా? కేజ్రీవాల్, మాయావతి,మమతలు ఓదార్చారా?’’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.


‘‘మంగళగిరిలో పప్పునాయుడు గెలుపు కోసం ఓటుకు పది వేలు పంపిణీ చేస్తున్నారు. కూపన్లు ఇస్తున్నారట. వాటిని గుంటూరులోనో, విజయవాడలోనో ఫలానా వ్యక్తికి చూపిస్తే డబ్బు చెల్లిస్తారట. ఎన్ని తాయిలాలు ముట్ట చెప్పినా ఆర్కే గెలుపును ఆపడం చంద్రబాబు తరం కాదు.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.


తల కింద తపస్సు చేసిన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గురించి ఆయన రాజకీయ పరిజ్ఞానం గురించి సామాన్య ప్రజలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి కూడా అర్థమైపోయిందని విజయసాయిరెడ్డి సంచలన కామెంట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: