మైలవరం వైసీపీ ఇంచార్జి వసంత కృష్ణ ప్రసాద్ మంత్రి దేవినేని ఉమ పైన ఆయన నియోజకవర్గంలో చేస్తున్న ఆకృత్యాలు పైన నిప్పులు చెరిగారు. మైలవరంలో అలజడులు సృష్టించి లబ్ధిపొందేందుకు టీడీపీ నేత, మంత్రి దేవినేని ఉమ ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

ఈయన చెప్తున్న దాని ప్రకారం దేవినేని ఉమ అనుచరుడు దేవినేని పూర్ణ వైసీపీ కార్యకర్తలపై చెప్పులు, రాళ్లు విసిరి రెచ్చగొట్టాడట. వారి కార్యకర్తలను గొడవలు ఎందుకని తానే సముదాయించినట్లు వసంత కృష్ణ చెప్పుకొచ్చారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తిరిగి పోలీసులు తమపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు. టీడీపీ నేత దేవినేని ఉమ ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని కృష్ణప్రసాద్ హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో వైసీపీ విజయాన్ని ఆపలేరని జోస్యం చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: