జనసేనాని ఇపుడు చంద్రబాబును బాగా ఫాలో అవుతున్నట్లున్నారు. బాబుకు ఎంతసేపూ ఎదుటి వారి మీదనే కన్ను. వారి మీదనే ఆయన ఆలోచనలు ఉంటాయి. తన పార్టీ విషయాన్ని, జరిగే అరాచకాలను బాబు ఎన్నడూ కలలో కూడా గుర్తు చేసుకోరు. ఎంతసేపు వైసీపీ తో పాటు ప్రత్యర్ధుల మీద బురద జల్లేందుకు  తయారుగా ఉంటారు. 


ఇక విశాఖలో ఈ రోజు రోడ్ షో చేసిన పవన్ కళ్యాణ్ జగన్ మీద మరోసారి యధా ప్రకారం విరుచుకుపడ్డారు. జగన్ విజయసాఇరెడ్డి ఇద్దరూ  జైల్ పార్టనర్స్ అంటూ ఎకసెక్కం ఆడారు. జగన్ పార్టీ అవినీతి పుట్ట అన్నారు. ఆయన విశాఖ వస్తే ప్రజలు నిలదీయాల‌ని కూడా పిలుపు ఇచ్చారు. ఇక గాజువాకకు జగన్ వస్తున్నారని, తనని ఓడించేందుకే జగన్ టూర్ పెట్టుకున్నారని పవన్ ఆరోపించడం విడ్డూరం పనిలో పనిగా తన స్నేహితుడు ఆలీని వైసీపీలోకి ఎందుకు చేర్చుకున్నారని పవన్ నిలదీశారు.

మీకు యాక్టర్లు అవసరం లేదు కదా మరి ఆలీ కావాల్సివచ్చారా అంటూ పవన్ కామెంత్శ్ చేయడం విశేషం. తాను, జేడీ లక్ష్మీనారాయణ విశాఖకు రక్షకులమని, ఇక్కడ  ఎవరైనా భూములు లాక్కుంటే వారి తాట తీస్తామని పవన్ యధాప్రకారం తన భాషలో వార్నింగులు ఇచ్చారు. మొత్తానికి పవన్ కి జగన్ వైసీపీ టార్గెట్ కావడం సాధారణమైపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: