టిడిపి తరపున ఎన్.టి.ఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ హిందూపుర్ నుండి మరోసారి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రస్తుతం పార్టీ ప్రచారంలో తిరుగుతున్నారు. అయితే బాలయ్య నోటి దురుసుతనం గురించి తెలిసిందే. రీసెంట్ గా ఓ వీడియో జర్నలిస్ట్ ను నరికేస్తా.. చంపేస్తా అంటూ రెచ్చిపోయిన బాలకృష్ణ తర్వాత క్షమాపణ చెప్పక తప్పలేదు.       


ఇక లేటెస్ట్ గా మరోసారి నోరు జారాడు బాలకృష్ణ. అసలేమాత్రం ఆవేశం ఆపుకోలేని బాలయ్య బాబు హిందూపుర్ లో ప్రచారంలో భాగంగా మీరు వేల మెజారిటీతో గెలుస్తారని ఓ అభిమాని అన్నాడు. 50 వేలు, 60 వేలు అంటూ చెప్పగా నీ పేరు ఏంటో చెప్పరా గెలిస్తే చాలు నీ యంకమ్మ వేల మెజారిటీ ఏంట్రా అంటూ తన పార్టీ కార్యకర్తల మీద ఫైర్ అయ్యాడు. నీ అడ్రెస్ చెప్పు కంఠం కోసేస్తా అని సైగలతో చూపించాడు బాలకృష్ణ. 



బాలకృష్ణ నోరు జారడం ఇది మొదటిసారి కాదు. అసలే ఏపిలో టిడిపి పరిస్థితి అటు ఇటుగా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ తన మాట తీరుతో ప్రజలకు దూరం అవుతున్నాడు. ఇప్పటికే ఈ హిందూపుర్ ప్రజలు బాలకృష్ణ పాలన మీద అసంతృప్తిగా ఉండగా ఇప్పుడు పార్టీ ప్రచారంలో కూడా కార్యకర్తల మీద నోరు పారేసుకోవడం మరింత నష్టాన్ని తెచ్చేలా ఉంది. 


ఇలా మైకు పట్టుకున్న ప్రతిసారి టంగ్ స్లిప్ అవుతూ వస్తూ విమర్శలకు తావు ఇస్తున్న బాలకృష్ణ. ఈసారి అక్కడ గెలిచే అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయని చెబుతున్నారు. వైసిపి తరపున ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబడ్డారు. ఓవరాల్ గా ఈసారి అన్ని సర్వేలు జగన్ నే సిఎం అని చెబుతుండగా ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలు.. మే 23న విడుదలయ్యే ఫలితాలు ఎలా ఉండనున్నాయో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి: