పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఈసారి ఏపి ఎలక్షన్స్ లో ముద్ర వేయాలని చూస్తుంది. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టిన పవన్ మొదట్లో ఫోర్స్ ఫుల్ గా అనిపించినా ఆ తర్వాత అతను మాట్లాడే మాటలు.. ఇచ్చే స్పీచులు ప్రజలకు అర్ధం కాలేదు.. జనసేన తరపున పవన్ కళ్యాణ్ భీమవరం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా నర్సాపురం నుండి నాగబాబు ఎంపి అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు.


ఇప్పటికే నాగబాబు కోసం మెగా డాటర్ నిహారిక ప్రచారంలో పాల్గొన్నది. లేటెస్ట్ గా జబర్దస్త్ టీం మొత్తం జనసేనకు సపోర్ట్ గా నాగబాబు కోసం నర్సాపురంలో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలాఉంటే మెగా హీరోలెవరు జనసేనకు ప్రచారం చేస్తారా చేయరా అన్న డౌట్లు వచ్చాయి. వాటికి సమాధానంగా జనసేన కోసం ఇద్దరు మెగా హీరోలు ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది.


ఇంతకీ ఎవరా ఇద్దరు మెగా హీరోలు అంటే ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాగా.. మరొకరు వరుణ్ తేజ్ అని తెలుస్తుంది. బన్ని, వరుణ్ ఇద్దరు జనసేన ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ విషయాన్ని అఫిషియల్ గా నాగబాబు సతీమణి పద్మజ ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ అమెరికాలో ఉన్నాడని ఇవాళ రేపట్లో వచ్చి ప్రచారంలో పాల్గొంటారని ఆమె వెళ్లడించారు.


మెగా హీరోల్లో రాం చరణ్ బాబాయ్ కు ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తున్నాడు. సాయి తేజ్ ప్రస్తుతం తన చిత్రలహరి సినిమా బిజీలో ఉన్నాడు. చిరంజీవి కూడా జనసేన విషయంలో సైలెంట్ గా ఉన్నారు. మరి మెగా సపోర్ట్ తో ముందుకెళ్తున్న జనసేన అనుకున్న విధంగా లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: