జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న నరసాపురంలో ఆయన ప్రచారంలోనే చేతులు ఎత్తి వేసినట్లు కనపడుతోంది. భారీ అంచనాలతో నాగబాబు ఎంపీగా పోటీ చేసేందుకు రంగంలోకి దిగగా నర్సాపురం లోక్సభ పరిధిలోని ఉన్న భీమవరం అసెంబ్లీ సీటు నుంచి స్వయంగా పవన్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు పవన్ భీమవరంలో గెలవడం అంత సులువు కాదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి భీమవరం లో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ నుంచి పవన్ కు గట్టి పోటి ఎదురవుతున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఆశలన్నీ గాజువాక మీదే ఉన్నాయి పవన్ కూడా భీమవరం మీద కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గించి గాజువాక మీద దృష్టి సారిస్తున్నారు పవన్ కళ్యాణ్ కోర్ టీం సైతం గాజువాక లోనే ఎక్కువగా ప్రచారం చేస్తోంది.
ఇదిలా ఉంటే నరసాపురం లో జనసేన నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న పవన్ సోదరుడు నాగబాబు సైతం సానుకూల పవనాలు కనిపించడం లేదు. నాగబాబు ప్రచారంలోనే టిడిపి, వైసీపీ అభ్యర్ధులు అయిన కలవపూడి శివ, రఘురామకృష్ణంరాజు తో పోలిస్తే పూర్తిగా చేతులు ఎత్తేశారు లోక్సభ నియోజకవర్గ పరిధిలో టిడిపి, వైసిపి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే నాగబాబు వాళ్లతో పోలిస్తే చాలా దూరంగా ఉన్నారు. దీంతో నరసాపురం లో నాగబాబుకు ఘోర పరాజయం తప్పదని తేలిపోయింది. కనీసం పరువు అయినా కాపాడుకునేందుకు ఇప్పుడు జనసేన క్యాంప్ నరసాపురంలో మెగా కాంపౌండ్ హీరోలను రంగంలోకి దించనుంది.
అతి త్వరలోనే మెగా కాంపౌండ్ హీరోలు జనసేన ప్రచారానికి తరలి రానున్నారని ఇప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. పవన్కు తన ప్రచారం తాను చూసుకునేందుకే టైం లేదు. ఇక అన్న నాగబాబు కోసం ఏం ప్రచారం చేస్తారో తెలియని పరిస్థితి. దీంతో మెగా కౌంపౌండ్ హీరోలు జనసేన అభ్యర్థుల్లో అతి ముఖ్యులకు ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి నాగబాబు తనయురాలు నిహారిక మరియు భార్య కొణిదెల పద్మజ జనసేన తరపున ప్రచారం చేస్తున్నారు. తాజాగా పద్మజ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జనసేన పార్టీ తరఫున పోయి చేసేందుకు మెగా కుటుంబం నుంచి ఇంకా వస్తున్నారని తెలిపారు.
చివరి మూడు నాలుగు రోజుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేన కోసం ప్రచారం చేసేందుకు రాబోతున్నారని చెప్పారు. ఇప్పటికే నరసాపురంలో పోలింగ్కు ముందే నాగబాబు ఓటమి బాటలో ఉండడంతో కనీసం పరువు కాపాడుకోవడంతో పాటు డిపాజిట్లు దక్కించుకునేందుకు అయినా మెగా హీరోలను రంగంలోకి దించుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా నాగబాబు ప్రచారంతో ఊసురోమంటోన్న మెగా, జనసేన అభిమానులకు ఈ ఇద్దరు హీరోలు ప్రచారానికి వస్తున్నారన్న వార్త కాస్త ఊరట కలిగించేదే.