ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాలు ముమ్మరం అవుతున్న వేళ..ముఖ్య నేతలు తమ ప్రసంగాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది పనులు చూసి వేస్తారని అంటుంటే..ఐదేళ్లలో ప్రజలను అధికార పార్టీ దారుణంగా మోసం చేసిందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరోసారి కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ..ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ పూనుకుంటుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ విమర్శిస్తుంది.
ఏపిలో ప్రజా సంకల్ప యాత్ర తర్వాత ఆంధ ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించిన జగన్ ఇప్పుడు ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు సైతం జగన్ గెలుపు వైపే మొగ్గు చూపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ దఫా టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరా పోరు సాగుతోంది. తాజాగా వైసీపీ అభిమానులు వైఎస్ జగన్ గెలవాలంటూ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.