గాజువాకలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు సభలో ప్రసంగిస్తూ ధైర్యవంతుడు, పోరాట పటిమ కలిగిన జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి అన్నారు. వైజాగ్ లాంటి జిల్లాకు బలమైన నాయకుడు కావాలని అలాంటి బలమైన నాయుకుడు జేడీ గారని, ఆలోచించి ఎన్నుకోవాలి అని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు, ఇప్పటికే టీడీపీ ప్రభుత్వ పాలన చూసాం అని, అలాగే వైసీపీ పార్టీ మరియు జనసేన పార్టీలను చూసి ప్రజలు ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.జగన్ ను విమర్శిస్తూ అతను ప్రజలు సమస్యలు చెప్పుకుంటే అన్ని సీఎం అయ్యేక చేస్తాను అంటాడనీ పవన్ చురకలు అంటించారు. నేను కనుక జగన్ స్థానంలో ఉంటే అందరిని నిలదీస్తూ, ఎందుకు చేయరు అని ప్రశ్నిస్తూ పనులు జరిపించే వాడిని అన్నారు. 

ఇంకా మా పిల్లలు పెద్దయ్యాక చేస్తారా, అప్పటి దాకా మేము వేచి ఉండాలా అంటూ జగన్ ను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. పని చేసే తత్వం కలిగినవాడిని అని నాకు ప్రజలతో కలిసి ఉండడం ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు.వైజాగ్ లో గొడవలతో సమస్యలను తీరుచుకోవలసి వస్తుందని, మీ బదులు గా మేము పోరాడి మీ సమస్యలు తీరుస్తాము, అందుకు సరైన నాయకుడు జేడీ అని ఆయనను వైజాగ్ ఎంపీ గా గెలిపించాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: