రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు, ఇప్పటికే టీడీపీ ప్రభుత్వ పాలన చూసాం అని, అలాగే వైసీపీ పార్టీ మరియు జనసేన పార్టీలను చూసి ప్రజలు ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.జగన్ ను విమర్శిస్తూ అతను ప్రజలు సమస్యలు చెప్పుకుంటే అన్ని సీఎం అయ్యేక చేస్తాను అంటాడనీ పవన్ చురకలు అంటించారు. నేను కనుక జగన్ స్థానంలో ఉంటే అందరిని నిలదీస్తూ, ఎందుకు చేయరు అని ప్రశ్నిస్తూ పనులు జరిపించే వాడిని అన్నారు.
ఇంకా మా పిల్లలు పెద్దయ్యాక చేస్తారా, అప్పటి దాకా మేము వేచి ఉండాలా అంటూ జగన్ ను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. పని చేసే తత్వం కలిగినవాడిని అని నాకు ప్రజలతో కలిసి ఉండడం ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు.వైజాగ్ లో గొడవలతో సమస్యలను తీరుచుకోవలసి వస్తుందని, మీ బదులు గా మేము పోరాడి మీ సమస్యలు తీరుస్తాము, అందుకు సరైన నాయకుడు జేడీ అని ఆయనను వైజాగ్ ఎంపీ గా గెలిపించాలని కోరారు.