మంత్రి గంటా శ్రీనివాసరావును ఓడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు. చంద్రబాబు చుట్టూ గంటా శ్రీనివాసరావు వంటి కబ్జాకోర్లు ఉంటే.. పవన్ కల్యాణ్ చుట్టూ జేడీ వంటి నిజాయితీ కల వ్యక్తులు ఉన్నారని పవన్ అవేశంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన అభిమానులు గంటను పగలగొడదామని నినాదాలు ఇచ్చారు. 


దీంతో స్పందించిన పవన్ కల్యాణ్.. గంటను పగలగొట్టొద్దు.. తప్పు.. ఆ గంటను మోగకుండా చేస్తే చాలు.. అన్నారు. గంట మోగకుండా ఉండాలంటే.. మీరంతా ఎన్నికల్లో గ్లాసు గుర్తుకు ఓట్లు గుద్దాలని పిలుపు ఇచ్చారు. విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గం నుంచి గంటా ఓడిపోవ‌డం జ‌న‌సేన అభ్యర్ధి ఉషాకిర‌ణ్ గెల‌వ‌డం ఖాయమన్నారు పవన్. 

మార్పు కోసం జ‌న‌సేన‌కే ఓటు వేయండి. గాజు గ్లాస్ గుర్తుపై నిల‌బ‌డే అభ్యర్ధుల‌ను అఖండ మెజార్టీతో గెలిపించండి అని వవన్ కల్యాణ్ ఓటర్లను అభ్యర్థించారు. 2014లో ప‌ల్లకీలు మోసిన మ‌మ్మల్ని పుల్లల్లా తీసి ప‌క్కన‌ప‌డేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవ‌స్థ. దానిని దాటుకొని మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం.. అంటూ రంకెలు వేశారు. 

అయితే పవన్ కల్యాణ్ మాటలు చెప్పినంత ఈజీ కాదు గంటాను ఓడించడమంటే.. ఇప్పటివరకూ గెలిచిన చోట గెలవకుండా.. మారిన పార్టీ మారకుండా ఉన్నా కూడా ప్రతిసారీ గెలుస్తూనే ఉన్న నేత గంటా. మరి అలాంటి గంటా శ్రీనివాసరావును పవన్ సేన ఓడించగలుగుతుందా.. చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: