టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌చారం ఓట్లు రాల్చ‌డం సంగ‌తి అలా ఉంచితే...కొత్త వివాదాల‌ను తెర‌మీద‌కు తెస్తోంది.హిందూపుంలో మొన్న వీడియో జర్నలిస్టుకి వార్నింగ్ ఇచ్చి విమర్శలపాలైన బాలయ్య.. ఈసారి సొంత పార్టీ కార్యకర్తలపైనే విరుచుకుపడ్డారు. పీక కోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వివాదానికి  కారణమయ్యారు. నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. అంటూ బాలకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న భార్య ప‌క్క‌నే ఉండ‌టం గ‌మ‌నార్హం.


త‌న ఇలాకా అయిన హిందూపురం నియోజకవర్గంలో భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ ఎన్నికల ప్రచార రథంపై వెళుతుండగా ఓ కార్యకర్త.. ఈ ఎన్నికల్లో మీకు వేలల్లో మెజారిటీ వస్తుంది అంటూ అరిచాడు. మరో కార్యకర్త ఈసారి 60వేల మెజారిటీ అంటూ కేకలు వేశాడు. దీంతో బాలయ్యకు కోపం వచ్చింది. హైప్ క్రియేట్ చేసేవారి పీక కోయాలని (సైగ చేస్తూ) పక్కనే ఉన్న భార్య వసుంధరతో బాలయ్య అన్నారు. మరో కార్యకర్త సర్‌ 60 వేలు, 70 వేలు మెజారిటీ సర్‌ అంటూ అరవడంతో.. అరే, నీ పేరు, అడ్రస్‌ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా(సైగ చేసి మరీ).. అంటూ బాలయ్య రెచ్చిపోయారు. బాలకృష్ణ కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తుండగా వసుంధర నవ్వుతూ కనిపించారు.


బాలకృష్ణ చేష్టల పట్ల స్థానికులే కాదు టీడీపీ కార్యకర్తలూ విస్మయం చెందుతున్నారు. బాల‌య్య ప్ర‌వ‌ర్త‌ను సంబంధించిన‌ వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి హుందాగా వ్యవహరించాలని.. ఇలా దిగజారి పోకూడదని, రౌడీలా బిహేవ్ చెయ్యకూడదని కొందరు నెటిజన్లు హితవు పలికారు. ఇంత జ‌రిగినా...బాల‌య్య మారుతాడా....ఏమో అలా ఆశించ‌డం ఆశే అవుతుందేమో!



మరింత సమాచారం తెలుసుకోండి: