ఎన్టీఆరే తన దైవంగా లక్ష్మీపార్వతి జీవించింది.. ఇదీ ఇటీవల విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రధాన కథ. కానీ లక్ష్మీపార్వతి మనసులో ఎన్టీఆర్ గురించి నిజంగా దైవభావనే ఉందా.. ఆమె ఎన్టీఆర్ ను దేవుడనే అనుకుంటున్నారా..
అదేమీ కాదంటోంది టీవీ 5 ఛానల్ కథనం.. లక్ష్మీపార్వతి తన వద్ద పనిచేసిన కోటి అనే వ్యక్తితో మాట్లాడినట్టు చెబుతున్నా ఆడియో టేప్ను ప్రసారం చేసింది. దాని ప్రకారం.. ఇటీవల నాదెండ్ల భాస్కరరావు అనేక యూట్యూబ్ ఛానల్స్ లో ఎన్టీఆర్ గురించి చేసిన ఆరోపణలను కోటి లక్ష్మీపార్వతిని ఫోన్లో అడిగారు..
అమ్మా అవన్నీ నిజమేనా.. నాదెండ్ల భాస్కర్రావు చెప్పినవి నిజమేనా అని అడిగాడు. అందుకు ఆమె.. నాదెండ్ల భాస్కర్ రావు మాటలు నమ్మొచ్చు.. పెద్దాయన తక్కువ వాడేమీ కాదు.. చాలా ఉన్నాయి దుర్మార్గాలు అనట్టు ఆడియో టేప్లో ఉంది.
అమ్మాయిలతో ఎన్టీఆర్ రిలేషన్స్ నిజమేనా అని అడిగితే.. సినిమా వాళ్లకు అవి మామూలేగా అంటూ స్పందించింది లక్ష్మీపార్వతి. మగవాళ్లు కదా.. అని కామెంట్ చేసింది. ఇప్పుడీ ఆడియో సంచలనం సృష్టిస్తోంది. మరి ఈ ఆడియో నిజమైన దేనా.. కాదా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.