పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుంటడంతో ఏపీలో పోలీసులు ఎన్నికల విధులు ముమ్మరం చేశారు. అనుమానం వచ్చిన చోటల్లా తనిఖీలు చేస్తున్నారు. జోరు పెంచేశారు. పార్టీలకు అతీతంగా ఈ దాడులు, సోదాలు జరుగుతున్నాయి. 


తాజాగా నెల్లూరు నారాయణ కాలేజీ ఏజీఎం పద్మనాభరెడ్డి ఇంటిపైనా పోలీసులు దాడులు, తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో తొమ్మిది లక్షల రూపాయల నగదు లభించింది. నగదుతో పాటు ఓటరు జాబితాలు, ఓటరు స్లిప్పులు దొరికినట్టు ప్రాధమిక సమాచారం. 

మంత్రి నారాయణ ఇక్కడ నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే సీటు కోసం పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం నారాయణ కాలేజీల సిబ్బంది అంతా పని చేస్తున్నట్టు సమాచారం. అందుకే నారాయణ కాలేజీ సిబ్బందిపైనా పోలీసులు ఓ కన్నేశారు. 

ఇప్పటికే పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా దాడులు, సోదాలు ముమ్మరం చేశారు. కడప జిల్లాలో సీఎం రమేశ్ ఇంటిపైనా పోలీసులు తనిఖీలకు యత్నించారు. ఆయన అనుచరుల ఇళ్లలో సోదాలు చేశారు. మొత్తానికి పోలీసులు తమ విధులు బాగానే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: