చిత్తూరు జిల్లాకు చెందిన తాజా పరిస్థితిని ఓ యూట్యూబ్ ఛానల్ జిల్లా వ్యాప్తంగా పర్యటించి తన అంచనాలను విడుదల చేసింది. ఈ జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఏక పక్షంగా.. మరికొన్నిచోట్ల పోటాపోటీగా పోరు ఉంది. 


ఈ జిల్లానుంచి సీఎం చంద్రబాబు, నటి రోజా వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు. ఇక సర్వే ఫలితాను పరిశీలిస్తే.. ఈ జిల్లాలో...8 స్థానాలు గెలుచుకునే అవకాశాలు స్పషంగా ఉన్నాయి. చంద్రగిరి, పీలేరు, పలమనేరు, పూతలపట్టు , నగరి, గంగాధర నెల్లూరు, సత్యవేడు కచ్చితంగా వైసీపీ గెలుస్తుందట. 

ఇక టీడీపీ విషయానికి వస్తే.. ఈ పార్టీ తంబళ్లపల్లె కుప్పం , శ్రీకాళహస్తి స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక చిత్తూరు,  తిరుపతి , మదనపల్లె స్థానాల్లో పోటాపోటీ పోరాటం జరుగుతోందట. ఇవి ఎవరైనా గెలవచ్చని తెలుస్తోంది. 

ఇక ఈ జిల్లాలో జనసేన ఖాతా తెరిచే అవకాశం ఏమాత్రం లేదట. కానీ ఒకటి, రెండు స్థానాల్లో తన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదీ చిత్తూరు జిల్లా ఫైనల్ సర్వే రిపోర్ట్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: