మోహన్ బాబు వైసీపీ పార్టీలోకి చేరి చంద్రబాబు మీద విమర్శనా బాణాలను సంధిస్తున్నారు. విమర్శలు చేయడంలో కానీ మాట్లాడటంలో కానీ తనకే తానే సాటి  నిరూపించుకున్నాడు. మోహన్ బాబు మాట్లాడతూ అనుభవం లేని జగన్ కావాలా, 40 ఏళ్ల అనుభవం ఉన్న తను రావాలా తేల్చుకోమని ప్రజల్ని బెదరగొడుతున్నారు. ఈ కామెంట్లకు తిరుగులేని కౌంటర్ ఇచ్చారు నటుడు మోహన్ బాబు. చంద్రబాబు పొందిన అనుభవం లాంటిది జగన్ కు అస్సలు అక్కర్లేదన్నారు.


"నిజమే చంద్రబాబు, నీకు 40 ఏళ్ల అనుభవం ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే అది వెన్నుపోటు పొడవడంలో ఉంది. అక్రమాలు చేయడంలో ఉంది. మాటఇచ్చి తప్పడంలో ఉంది. అలాంటి అనుభవం జగన్ కు అక్కర్లేదు." పదేళ్ల నుంచి ఒకేమాట మీద నిలబడిన జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు మోహన్ బాబు. ఆచరణ సాధ్యమైన హామీలిస్తున్న జగన్ ను, అమలుకాని హామీలిస్తున్న చంద్రబాబును పోల్చిచూసుకోవాలని ప్రజల్ని కోరారు. మరోవైపు లోకేష్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.


"లోకేష్ కు ఓటు వేస్తే 6 ఛానెల్స్ బాగుపడతాయి. 6 పత్రికలు బాగుపడతాయి. భూకబ్జాదారులు బాగుపడతారు. లోకేష్ కు ఓటేస్తే మీ రక్తం కూడా తాగేస్తారు. మట్టి, ఇసుక అన్నీ దోచేస్తారు. లోకేష్ కు ఓటేస్తే నోట్లో వేలుపెట్టుకొని చీకుతూ ఐదేళ్లు అలా చూస్తూ కూర్చోవాల్సిందే." మంగళగిరి నియోజకవర్గంలో పిలిస్తే పలికే వైసీపీనేత కావాలో, చిత్తూరు నుంచి వచ్చి కబ్జాలు చేస్తానంటున్న నేత కావాలో తేల్చుకోవాలన్నారు మోహన్ బాబు. చంద్రబాబుకు ఫేస్ టు ఫేస్ మాట్లాడే ధైర్యంలేదన్న మోహన్ బాబు.. అతడికి నిలువెల్లా విషం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: