ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్టు మెంట్ రాజ్యం నడవాలంటే వనరులు, ధనం తప్పనిసరి, ప్రజాస్వౌమ్యంలో రాజైనా-బీదైనా తమ వంతు పన్ను చెల్లించవలసిందే ఇది చాలా ముఖ్యం. ఇదంతా ఇప్పుడెందుకు మాట్లాడుకోవలసి వస్తుందంటే.. మా పార్టీ వారిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి మా పార్టీ వాళ్లని టార్గెట్ చేస్తున్నారని సాక్షాత్తు రాజ్యాన్ని పాలించే రాజే అంటే ఎలా? ఇది దేనికి సంకేతం. 

ఐటి రైడ్ లో సంపాదనకు లెక్కలు అడుగుతారు, లెక్కలోని సంపాదననేమీ ముట్టుకోరు కదా?  ప్రభుత్వ కళ్లు కప్పి సంపాదించే నల్లధనంపైనే కదా వారి దృష్టంతా..అలాంటి నల్లధనాన్ని వెలికి తీస్తే బాధల్లో - కష్టాల్లో ఉన్న పేదవారిని ఆదుకోవచ్చు కదా.. దానికి మా పార్టీ అయితే ఏంటీ? పరాయి పార్టీ అయితే ఏంటీ అని కదా అనాలి రాజు.. మరి మన పాలకులు ఇలా ఎందుకు అంటున్నారు.. ఇలా ఎందుకు చేస్తున్నారని అంటున్నారు ఆంధ్రప్రజ.



మరింత సమాచారం తెలుసుకోండి: