ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ జోరు మంచి రేంజ్ లో ఉంది. జగన్ సభలకు ఇసుక వేస్తే రాలనంతగా జనం వస్తూ రావాలి జగన్ కావాలి జగన్ అంటూ నినాదాలు చేస్తూ హడావుడి సృష్టిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు జగన్ ఏ విధంగా పరిపాలన చూడాలి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి కొడుకు ఒకసారి అవకాశం ఇద్దామని అనుకుంటున్నట్లు సర్వే లలో ఫలితాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో తాను అధికారంలోకి వస్తే ఏ విధమైన పరిపాలన అందిస్తారు వంటి విషయాలను ఇటీవల సోషల్ మీడియా అనగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు జగన్. ఇటీవల జగన్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘టెక్నాలజీ ఆధారంగా పారదర్శక పాలన అందిస్తాం, అవినీతి లేకుండా ప్రభుత్వ వికేంద్రీకరణ చేపడతాం. సంక్షేమ ఫలాలను గడపగడపకూ అందిస్తాం.
సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తాం. అంధ్రప్రదేశ్ పై నాకున్న విజన్ ఇదే’ అని జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలని కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు రాజకీయాలకు దూరంగా సంక్షేమ ఫలాలు అందిస్తామని స్పష్టం చేశారు జగన్.
My vision for AP - a transparent, technology-driven, corruption-free, decentralised Govt, at your doorstep; with sustainable development; to be a forerunner state in the country.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2019