దెందులూరు వైసిపి అభ్యర్ధి అబ్బయ్య చౌదరిపై తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్ పోలింగ్ ఏజెంట్ శ్రీధర్ పై ధౌర్జన్యం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద జరిగిన వివాదంలో రెచ్చిపోయిన చింతమనేని హఠాత్తుగా శ్రీధర్ పై దాడికి దిగారు. వట్లూరు పోలింగ్ కేంద్రంలో ఉదయం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మొదలైంది.

 

పోలింగ్ మొదలవ్వగానే టిడిపి అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్ తన మద్దతుదారులతో పోలింగ్ కేంద్రంలో ప్రచారం మొదలుపెట్టారు. దాంతో అక్కడే ఉన్న అబ్బయ్య తో పాటు వైసిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఇదే విషయమై రెండు వర్గాల మధ్య పెద్ద వివాదం రేగింది. ప్రచారం చేస్తున్న చింతమనేనిని వైసిపి వాళ్ళు అడ్డుకున్నారే కానీ పోలింగ్ అధికారులు మాత్రం ఏమీ మాట్లాడలేదు.

 

కొద్దిసేపు రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత టిడిపి నేతలు రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రం వద్దే మొదలైన గొడవ కాస్త చింతమనేని రెచ్చిపోవటంతో మరో మలుపు తీసుకుంది. చింతమనేని హఠాత్తుగా శ్రీధర్ పై దాడి చేశారు. దాంతో పోలింగ్ సిబ్బంది మొత్తం బయటకు పరుగులు తీశారు. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అన్నది రసాబాసగా మారిపోయింది. ఈ విధంగా దెందులూరులోనే కాదు చాలా నియోజకవర్గాల్లో టిడిపి నేతలు ఇదే విధంగా రెచ్చిపోతున్నారు.  విషయంలో ఎన్నికల కమీషన్ ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: