తూర్పగోదావరిజిల్లా మండపేట మండలం కేశవరం లో ప్రచారానికి వెళ్ళిన వంగవీటి రాధ కు చెడూ అనుభవం ఎదురైంది. తమ కాపు సామాజిక వర్గం గా చెప్పుకునే ప్రజలే వంగవీటి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈయన మొన్న ఈ మధ్యే వైసీపీ నీ వదిలి టీడీపీ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.కృష్ణ జిల్లా అనగానే రాజకీయ నేతల్లో గుర్తుకొచ్చే పేరు వంగవీటి రాధ, మరియు దేవినేని ఫ్యామిలీ.

ఇన్ని రోజులు వీరు వేరువేరు పార్టీలలో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు టీడీపీ లో కలిసిపోయారు. ఇలా టీడీపీ తరుపున ప్రచారానికి వెళ్ళిన రాధ ను కొంత మంది యువకులు నిలదీశారు.వంగవీటి రాధా ఆ గ్రామంలో ప్రచారంకి వస్తున్నా విషయం తెలుసుకున్న అక్కడి ప్రజలు కాన్వాయ్ దగ్గరికి చేరుకున్నారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులకు తల ప్రాణం తోకకి వచ్చింది. రాధ పై వారు ప్రశ్నల బాణాలను సంధించారు. తన తండ్రిని చంపిన టీడీపీ పార్టీలో ఎలా చెరతావు అంటూ నిలదీశారు. చాలా సేపటి వరకు రాధ కన్వయిను ముందుకు సాగనివ్వలేదు.

పోలీసులు రంగప్రవేశం చేయడంతో కారు ముందుకి సాగింది. రాధ అక్కడి ప్రజలను శాంతి పరచడానికి ప్రయత్నించారు. తన మీద కోపం ఉన్న తన తండ్రి మీద ప్రేమ తగ్గనివ్వద్దు అంటూ రాధ కోరారు. ఇలా ప్రచారాన్ని అడ్డుకోవడం సరికాదని పోలీసులు వారించడం తో వారు శాంతించారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కోసం ప్రచారానికి వచ్చి రాధకు తమ కాపు వర్గీయులే అడ్డుకోవడం తో టీడీపీ లో ఆందోళన మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: