చంద్రబాబు లాంటి రాజకీయ భీష్మపితామహునికి కీలకసమయంలో భయమెందుకు? అసలు ఏదైనా నేఱంలో ఇరుక్కున్నారా? ఏదైనా నేఱ ఘటనలో భాగస్వామ్యం ఉందా? అయిన ఇంత అనుభవశీలిని ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఏం చేయగలరు? చంద్రబాబు అంతరాంతరాల్లో పేరుకుపోయిన ఈ భీతికి మూలం ఏమిటి? రాష్ట్రం లో జరిగిన ఐటి దాడుల్లోగాని, గతంలో సిబీఐ దాడుల్లో దొరికిన, నేరస్తులలో బాబు తాలూకు బినామీలుగాని, ఆర్ధిక లావాదేవీల్లోగాని చంద్రబాబుకు ఉన్న సంభందాలు ఏమైనా బయటపడ్డాయా? ఆ విషయాలేమైనా మోడీ గుప్పిట్లో చిక్కాయా? సిబీఐ ప్రవేశాన్ని రాష్ట్రంలో నిషేధించక ముందే నరెంద్ర మోడీ చేతుల్లో చంద్రబాబు జుట్టు ఇరుక్కుందా? మున్ముందు జరగనున్న ప్రమాదాన్ని ఊహించే సీబీఐని నిషేధించారా? ఇంతా చేసి కేంద్రాన్ని ఎలా నిరోధించగలరు?
వాటికి తగ్గట్టు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్రం లోని ప్రతిపక్ష వైసీపీ, పక్క రాష్ట్రం లోని అహికార టీఅరెస్ ప్రభుత్వంతో దాదాపు సమరం చేస్తున్నట్లు ఆయనే ప్రచారం చేసుకుంటున్నారు. అత్యంత కీలకమైన ప్రస్తుత ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతున్న చంద్రబాబు, తాను పదే పదే తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని, ఎంతమంది కలిసి వచ్చినా కూడా తను వెనక్కు తగ్గేది లేదని చాలా ఘర్షనాత్మకంగానే చెబుతున్న చంద్రబాబు టిడిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం, ఉత్తేజం నింపే యత్నం చేస్తున్నారు.
అంతే కాకుండా ఒంటరిగా పోరాడుతున్నాను అని, అంతిమ విజయం నాదే అని, తనను ఎవరూ ఏమీ చేయలేరని-ఆ ముగ్గురూ అంటే మోడీ జగన్ కేసీఆర్ కలిసినా కూడా తనకు లేశమాత్రమైనా హానిచేయలేరని అంటూ వస్తున్నారు. అయితే పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, చంద్రబాబులో ఎక్కడో గూడుకట్టుకుని భయం, భీతి దానంతట దే ఆయన స్వరంలో తన్నుకొని వస్తూ బయటపడిపోతుంది అన్న వాదన ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది.
ఐటీ దాడులకు నిరసనగా విజయవాడలో ధర్నాకు దిగిన చంద్రబాబు,
"ఈ సారి గెలవకపోతే.. ఇక మనకు భవిష్యత్తు లేదు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని సాయంత్రానికి విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా విశాఖలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన చంద్రబాబు నోటి వెంట కలకలం రేపే సంచలనాత్మక మాటలు వినిపించాయి. "నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో!" నని ఆందోళన నిండిన స్వరంతో మాట్లాడిన చంద్రబాబు. దానికి సమాధానంగా తనకు తానే "నేనెప్పుడూ నేరస్థులను ప్రోత్సహించలేదు" అని చెప్పుకొచ్చారు. అరెస్ట్ మాట చంద్రబాబు నోట వినగానే సభకు వచ్చిన జనంతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఒకింత షాక్ కు గురయ్యారట.
అయినా చంద్రబాబు ఈ సందర్భంగా ఏం మాట్లాడారన్న విషయానికివస్తే.. "రేపో మాపో నన్ను కూడా అరెస్ట్ చేస్తారు... చేసుకోనివ్వండి... నేరస్థులను నేనెప్పుడూ ప్రోత్సహించలేదు. మత కలహాలను, తీవ్రవాదాన్ని అణచివేశాను. నాపై 24 బాంబులేసినా భయపడలేదు.... మనల్ని ఏకాకి చేసి ఇష్టమొచ్చినట్లు దాడి చేస్తున్నారు... మా అభ్యర్థులు...మా నేతల ఇళ్లపై ఐటీ... ఈడీ... దాడులు చేస్తున్నారు. అవసరమైతే జైలుకైనా వెళ్తా, భయపడేది లేదు. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇష్టానుసారం ముందుకెళ్తే మోదీ ఖబడ్దార్" అని చంద్రబాబు పిరికితనం నిండిన భీతితో సంచలన వ్యాఖ్యలు చేశారు. బేలతనం ఉట్టిపడేలా మాట్లాడటం ఆయన శైలికి విరుద్ధం చంద్రబాబు చెరసాల కు వెళ్ళటం ఖాయమైందా? లేకుంటే ఆయనలో ఇంత భయం ఎందుకు?
చంద్రబాబు నోట ఇలాంటి మాటలు వెలువడ్డ నేపథ్యంలో ఆయనలో "అరెస్ట్ భయం" మామూలుగా లేదని స్పష్టంగా తెలుస్తుందని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.