మరో ఐదు రోజుల్లో ఎన్నికలు ఇటువంటి క్రమంలో ఉగాది పండుగ వచ్చిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ నేతలు తమ తమ జాతకాలను చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉగాది పండుగ పర్వదినం నాడు ప్రముఖ జ్యోతిష పండితులు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధినేత జగన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.


వైయస్ జగన్ జాతకంలో ఏప్రిల్ నెల 30 వరకు శని మహర్ధశ ఉంటుందని, ఆపై బుధ మహర్దశ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయన ఆరుద్రా నక్షత్రం, కన్యాలగ్నంలో, మిథున రాశిలో జన్మించారని, శక్తిమంతమైన బ్రహ్మయోగం, గజకేసరి యోగం ఆయన జాతకంలో ఉన్నాయని అన్నారు. లగ్నదశమాధిపతి అయిన బుధుడు అతిక్రాంత యోగాన్ని అందివ్వనున్నారని, దీనివల్ల విశేష రాజయోగం రానుందని జోస్యం చెప్పారు.


రాజ్యాధికారం సంపాదించాలంటే కావాల్సిన శని అనుగ్రహం విషయంలో జగన్ ముందున్నారని, ఆయన జాతకంలో శని పితృస్థానంలో ఉన్నారని అన్నారు. ఖచ్చితంగా దేశ మరియు రాష్ట్ర రాజకీయాలలో జగన్ ప్లే రోల్ కీలక మంటూ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: