జూనియర్ ఎన్టీఆర్.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ మనవడు. ఆయన్ను చంద్రబాబు 2009  ఎన్నికల సమయంలో వాడుకుని వదిలేశారన్న వాదన ఉంది. తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి టీడీపీకి ఎప్పుడైనా ఎలాంటి సేవకైనా సిద్ధం అని గతంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. 


పాపం అలా ప్రకటించినా.. చంద్రబాబు ఆయన్ను దూరంగా ఉంచడంతో పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దృష్టి సినిమాలపైనే ఉంది. తెలుగుదేశానికి చంద్రబాబు తర్వాత లోకేశ్ నాయకత్వం వహించలేడని.. ఎన్టీఆరే సరైన వారసుడిని నమ్మేవారు చాలామందే ఉన్నారు. 

ఐతే.. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మామ.. వైసీపీలో చేరారు. కానీ ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ నోరు మెదపలేదు. తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో జగ్గయ్యపేట మండలంలో కొందరు వైసీపీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని వాడుకున్నారట. 

జూనియర్ ఎన్టీఆర్ మెడలోని పసుపు కండువాను మార్ఫింగా చేసి వైసీపీ కండువా వేసి.. ఫ్లెక్సీలు తయారు చేసి ప్రదర్శించారట. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కొందరు హర్టయ్యారు. దీంతో వారు జగ్గయ్యపేటలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొందరిని అదుపులోకి తీసుకున్నారట కూడా. 



మరింత సమాచారం తెలుసుకోండి: