ఆంధ్రులకు నిబద్దత లేదు.. ఆంధ్రులు కులపిచ్చితో కొట్టుకుంటారు.. తెలంగాణ వారికి నిబద్దత ఉందంటూ.. విజయసాయిరెడ్డి చెప్పిన ఆడియో టేప్ దొరికిందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ శనివారం రచ్చ రచ్చే చేసింది. అసలే ఎన్నికల సమయం కావడంతో అందులోనూ వైసీపీని దెబ్బ తీసే కథనం కావచ్చని గంటల తరబడి హంగామా చేసింది.
సాయంత్రం దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన విజయసాయిరెడ్డి.. తనకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రజలను కించపరిచినట్లుగా విషప్రచారం చేస్తుందని, దీనిపై ఈసీకి, సీఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమాజానికి పట్టిన చీడ పురుగు రాధాకృష్ణ అని ధ్వజమెత్తారు.
ఐదేళ్లుగా చేసిన దోపిడీలకు చంద్రబాబుతో పాటు ఆయనకు సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా జైలుకు వెళ్తారని, దానిలో ఎలాంటి సందేహం లేదని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారని లోక్నీతి, సీఎస్డీఎస్ సర్వే చెప్పినట్లుగా 130 స్థానాలు గెలుచుకోబోతున్నారని ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం రాశారు. దాన్ని తిప్పి కొడుతూ మాకు ఆ సర్వేకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ స్పష్టంగా తెలియజేశారు. చంద్రబాబు, రాధాకృష్ణ ముఖం మీద ఉమ్మేసినట్లేనని చాలా స్పష్టంగా తెలుస్తుంది.
నాలుగున్నర సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంచుమించుగా ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికకు రూ. 15 వందల కోట్ల ప్రకటనలు, మిగతా రూపంలో రిసిట్స్ వచ్చాయి. ఇది కాకుండా అధికారం అడ్డుపెట్టుకొని మరో రూ. 15 వందల కోట్లకు సెటిల్మెంట్ చేసిన దళారి రాధాకృష్ణ. ఆంధ్రజ్యోతి కుల జ్యోతి మాత్రమే. ఒక కులానికి కొమ్ముకాస్తున్న పత్రిక మాత్రమేనని స్పష్టంగా తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతంలో కిరోసిన్, రేషన్ బియ్యంlదొంగ అని తానే స్వయంగా చెప్పుకున్నాడు. ఒక దొంగకు ఇంతకు మించిన ఆలోచనలు వస్తాయా అని దుయ్యబట్టారు విజయసాయిరెడ్డి రాధాకృష్ణ నువ్వు నిజమైన జర్నలిస్టు అయితే.. నీ చానల్లో ప్రసారం చేసిన న్యూస్ ప్రూవ్ చేయి అని సవాల్ విసిరారు.