అవును మీరు చదివింది నిజమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మేనల్లుడు ఇస్తే గిస్తే పవన్ కు మద్దతు పలుకుతాడు కానీ వైసిపికి మద్దతుగా నిలవడటమేంటని అనుమానంగా ఉందా ? నిజమే హోలు మాత్రం పార్టీకి మద్దతుగా నిలవటం లేదుకానీ నంద్యాలలో వైసిపి తరపున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలవాలట.  మాజీ మంత్రి శల్పా మోహన్ రెడ్డి కొడుకే రవిచంద్రారెడ్డి.

 

రవి తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని అర్జున్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మంచివ్యక్తులు ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని బన్ని చెప్పారు. శిల్పా రవి గెలిస్తే సమాజానికి మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి రవి విజయంతో ముందుకు దూసుకుపోవాలని ఆకాంక్షించారు.

 

నిజానికి ఇక్కడ జనసేన తరపున సజ్జల శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్ధున్నా కానీ వైసిపి అభ్యర్ధే గెలవాలని కోరుకున్నారు. అదేమిటంటే రాజకీయం వేరు వ్యక్తిగతం వేరన్నారు. రవితో తనకు చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని బన్నీ చెప్పారు. జనసేన అభ్యర్ధిని కాదని వైసిపి అభ్యర్ధి గెలవిలని అర్జున ట్విట్టర్, ఇన్ స్టాగ్రంలో మెసేజ్ పెట్టటంపై వైసిపి శ్రేణులు మంచి జోష్ తో ఉన్నారు. సరే రవి కూడా అర్జున్ కు ధన్యవాదాలు చెప్పుకున్నారు లేండి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: