జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎండలో ఎక్కువగా ప్రయత్నించడంతో వడదెబ్బ తగిలి హాస్పిటల్ పాలైన సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వినూత్నంగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తాను పోటీ చేయబోతున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీకి ఓటు వేయాలని సూచించారు. తాను తలపెట్టిన ప్రజాపోరాట యాత్రలో అనేక సమస్యలను తన దృష్టికి వచ్చాయని నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు నియోజకవర్గానికి రాకుండా యూట్యూబ్ లో ప్రచారం చేయడంతో ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు గతంలో ఇలానే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వైజాగ్ లో ప్రజలు ఉద్యమం చేస్తున్న సమయంలో నేను వస్తానని చెప్పి ఆఖరికి రాకుండా చేసారు ఇదే పవన్ కళ్యాణ్ ఆ సమయంలో సోషల్ మీడియాలో కేవలం కామెంట్లు పోస్ట్ లు పెడుతూ ప్రజలను మభ్యపెట్టారు...ఇప్పుడు కూడా అదే ధోరణి వ్యవహరిస్తున్నారు...ఇక గెలిస్తే నియోజకవర్గంలో ఉంటారా లేకపోతే ఆన్ లైన్ లో పాలనా చేస్తారో చూడాలి. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరిస్తే భీమవరం నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: