ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుని రాష్ట్రానికి అద్భుతమైన ముఖ్యమంత్రిని అందించబోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నార్నే శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ వల్లే ఏపీలో అభివృద్ధి సాధ్యమన్నారు.2014లో చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి అట్టర్‌ ప్లాప్‌ అయ్యారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం  ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని నార్నే స్పష్టం చేశారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్‌ జగన్‌ బీసీలకు కూడా పెద్దపీట వేశారు. కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌, వైఎస్సార్ మాదిరి సుపరిపాలన చేస్తారని అన్నారు.‘చంద్రబాబు పచ్చి మోసగాడు. సొంత తమ్ముడికే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశాడు. అందుకే చంద్రబాబు తన మకాన్ని కుప్పానికి మార్చుకున్నాడు. అలాగే తిరుపతిలో చంద్రబాబు సొంత సోదరికి ప్రమాదం జరిగినా, ఇంతవరకూ ఆమెను ఎవరూ పరామర్శించలేదు.

అమరావతికి ఇచ్చిన డబ్బులు, ప్యాకేజీ ద్వారా వచ్చిన నిధులు వీటన్నింటిని చంద్రబాబు ఏం చేశాడు. రాజధానిలో కేవలం రెండు తాత్కాలిక భవనాలు కట్టాడు. ఇక ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా చంద్రబాబే స్వయంగా అడ్డుకున్నాడు. హైదరాబాద్‌లో సెటిలర్లు సంతోషం, ప్రశాంతంగా ఉన్నారో అందరికీ తెలుసు. ఇదే హైదరాబాద్‌లో చంద్రబాబు కూడా ఉంటున్నారు అనే విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది.’ అని నార్నే హితవు పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి: