ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్ జగన్ బీసీలకు కూడా పెద్దపీట వేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్, వైఎస్సార్ మాదిరి సుపరిపాలన చేస్తారని అన్నారు.‘చంద్రబాబు పచ్చి మోసగాడు. సొంత తమ్ముడికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మోసం చేశాడు. అందుకే చంద్రబాబు తన మకాన్ని కుప్పానికి మార్చుకున్నాడు. అలాగే తిరుపతిలో చంద్రబాబు సొంత సోదరికి ప్రమాదం జరిగినా, ఇంతవరకూ ఆమెను ఎవరూ పరామర్శించలేదు.
అమరావతికి ఇచ్చిన డబ్బులు, ప్యాకేజీ ద్వారా వచ్చిన నిధులు వీటన్నింటిని చంద్రబాబు ఏం చేశాడు. రాజధానిలో కేవలం రెండు తాత్కాలిక భవనాలు కట్టాడు. ఇక ఎన్టీఆర్కు భారతరత్న రాకుండా చంద్రబాబే స్వయంగా అడ్డుకున్నాడు. హైదరాబాద్లో సెటిలర్లు సంతోషం, ప్రశాంతంగా ఉన్నారో అందరికీ తెలుసు. ఇదే హైదరాబాద్లో చంద్రబాబు కూడా ఉంటున్నారు అనే విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది.’ అని నార్నే హితవు పలికారు.