మరికొన్ని రోజుల్లోనే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలందరూ తమ తమ ప్రచార పర్వంలో తలమునకలై ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఒకేఒక విషయమేమంటే మంగళగిరి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ విజయం సాధిస్తారా? లేదా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. 


కారణం వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆళ్ళ రామకృష్నారెడ్డి సంధించిన ఒక బ్రహ్మస్తమే అందుకు అంటున్నారు. ఇంతకీ ఆళ్ళ రామకృష్నారెడ్డి సంధించిన బ్రహ్మస్త్రం ఏమిటంటే. లోకేష్ ప్రస్తుతం పోటీ చేస్తున్న మంగళగిరిలో గతం నుంచి టీడీపీ తరుపున టిక్కెట్ ఆశిస్తూ, ఎంతో కష్టపడి పనిచేసిన ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ - కాండ్రు కమల ఆ స్థానం నుంచి టిక్కెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే ఇన్చార్జిగా ఉన్న ఆమెను తప్పించి చంద్రబాబు లోకేష్ కు కట్టబెట్టడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తుంది. 

అదే క్రమంలో వైసీపీ అభ్యర్థి అయిన ఆళ్ళ రామకృష్నారెడ్డికి ఆమె మద్దతు పలుకుతూ సంచలనం సృష్టించారు. మంగళగిరిలో అత్యధికంగా చేనేత కుటుంబాలు ఉంటాయి. అక్కడి అభ్యర్ది గెలుపుని డిసైడ్ చేసేది కూడా చేనేత వర్గం వారే కావడం విశేషం. అయితే కాండ్రు కమల చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు బీసీల మద్దతు పూర్తిస్థాయిలో  ఆమెకి మొదటి నుంచీ వస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా ఆమె టీడీపీని వీడి వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు షాక్ అయ్యారు. 

కానీ ఎలాగైనా సరే తన తనయుడిని మంగళగిరి నుంచీ గెలిపించుకోవాలని డిసైడ్ అయిన చంద్రబాబు డబ్బుని భారీస్థాయిలో ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడరని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు కూడా. చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు అయినా చేయడంలో ఆరితేరిన వ్యక్తని గ్రహించిన ఆళ్ళ  రామకృష్నారెడ్డి తిరుగులేని బ్రహ్మస్తాన్ని ప్రయోగించారు. వచ్చే ఎన్నికల్లో తనని భారీ మెజారిటీ తో గెలిపించాలని, అలా గెలిపించిన మీకు కృతజ్ఞతగా 2024 ఎన్నికల్లో అశేషసంఖ్యలో ఉన్న చేనేత వర్గానికి ఈ నియోజకవర్గ సీటును అప్పగిస్తానని, ఈ స్థానం నుంచీ నేను పోటీ చేయనని, ఇప్పటికే ఈ విషయంపై అధినేత జగన్ కి వివరించి చెప్పి ఒప్పించి మీకు మాట ఇస్తున్నానని ఆయన అన్నారు. 
kondru kamala Mangalagiri కోసం చిత్ర ఫలితం
ఈ ఒక్క ప్రకటనతో టీడీపీ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ ప్రకటన చేనేత వర్గాలని, బీసీలని ఎంతగానో ఆకర్షించిందని తెలుస్తోంది. దాంతో లోకేష్ బాబుకు ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఎలాంటి పరిస్థితులని అయినా సరే ఎదుర్కునే చంద్రబాబుకి ఈ విషయాన్ని దాటుకుని వెళ్ళడం పెద్ద కష్టం కాదని, లోకేష్ గెలుపు మంగళగిరిలో బంపర్ మెజారిటీ తో ఉంటుందని సవాల్ విసురుతున్నారు టీడీపీ నేతలు. చూద్దాం మంగళగిరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో.  తన కొడుకు కోసం ఒక చేనేత సామాజిక వర్గ మహిళ కిచ్చిన వాగ్ధానం ప్రక్కన బెట్టిన చంద్రబాబును అసలు నమ్మేదెలా? అంటున్నారు మంగళగిరి వాసులు. 

alla rama krishna reddy కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: