కావాలంటే మీరు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుని నిర్మొహమాటంగా టీడీపీ కి మద్దతు తెలపవచ్చు. అంతే కాని ఇలా ప్రజలను మభ్య పెట్టే పనులు, వారిని టీడీపీ కి పార్టీకి ఓటు వేయకపోతే ఏదో నష్టం జరగుతుంది అన్నట్టు సృష్టించడం మంచిది కాదు. జగన్ కేసుల గురించి పోలవరం ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడే ముందు ఒక సారి మీరు గతాన్ని తెలుసుకుంటే మంచిది. అమరావతి నీ కెసిఆర్ గారు అభివృద్ధి కాకుండా ఆపుతారు అంటున్నారు ఇది చాలా హాస్యాస్పదం.
కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కియా మోటార్స్ ను తీసుకొచ్చారు అని అన్నారు, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది దాని వల్ల ఉపయోగం ఉన్న కూడా దాని గురించి ఇంకా కొంచెం లోతుగా తెలుసుకుంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ , పాల్ గురించి మీరు చెప్పిన విషయాలు మళ్లీ చర్చించుకుందాం, అయితే ముందు మీరు దొంగ తిరుగుడు మాటలు మానుకోండి అంటూ సాయి తన వీడియో ముగించారు.