ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నది ఇదే.. శివాజీ అనే నటుడితో ఆదివారం చేయించిన చిన్నపాటి నాటకం.. అసలు లక్ష్యం ఇదే. ఒకే ప్రణాళికతో అటు పవన్‌ను ఇటు జగన్‌ను దెబ్బ కొట్టేందుకు తెలుగుదేశం గట్టి ప్రయత్నమే చేసింది. 


నిజం విత్ శివాజీ అనే ప్రదర్శనలో చంద్రబాబుకు భజన.. జగన్ పై విమర్శలతో నటుడు శివాజీ తనను ఆడిస్తున్నవారి కోరికలు బాగానే తీర్చారు. మరో వైపు అదే సమయంలో పవన్ కళ్యాణ్ అమాయకుడని.. ఆయన నిస్వార్థపరుడని సర్టిఫికెట్ ఇస్తున్నారు. 

ఇలా సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా.. మరోవైపు పవన్ కల్యాణ్‌ చంద్రబాబు సర్కారుపై కురిపస్తన్న విమర్శలను అంతగా పట్టించుకోకపోవడం ద్వారా జగన్ ను దెబ్బకొట్టాలన్న వ్యూహం మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు కే ఏ పాల్‌ను కూడా మెచ్చుకోవడం ద్వారా తన బాస్ ఎవరో శివాజీ చెప్పకనే చెబుతున్నట్టు కనిపించింది. 

పవన్ కల్యాణ్ రోజూ చంద్రబాబును తిడుతూనే ఉన్నాడు.. కానీ ఆవిషయాలను మాత్రం ఎల్లో మీడియా ఏమాత్రం ప్రొజెక్టు చేయదు. కేవలం జగన్ ను పవన్ విమర్శించే వాటికే ఆ మీడియా ప్రాధాన్యం ఇస్తోంది. దీని ద్వారా పవన్, టీడీపీ దోస్తీ ఉందని ప్రజలకు చెప్పడం ద్వారా జనసేనను దెబ్బ తీయాలని తెలుగుదేశం ఆలోచిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: