గతంలో ఎన్నికలు వస్తే నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో ఓటుకు నోటు ఇచ్చుకుని కొనుక్కొనేవాళ్లు.. ఇందుకు నాయకులకు చాలా మొత్తంలో డబ్బు ఖర్చయ్యేది. ఇప్పుడు అధికార పార్టీకి ఓ వెసులుబాటు వచ్చింది. ఎంచక్కా సర్కారు సొమ్మునే ఎన్నికల ముందు అధికారకంగా పంచొచ్చు. 


ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సర్కారు చేస్తున్నది అదే.. ఎన్నికల షెడ్యూల్ కు ముందు పసుపు కుంకుమ పథకాన్ని ప్రవేశ పెట్టేశారు. మరి ఇలా లబ్ది పొందిన మహిళలంతా ఇప్పుుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. 

పసుపు కుంకుమ కింద మళ్లీ మీ అకౌంట్లలో డబ్బు వచ్చాయి. చెక్ తీసుకుని వెళ్లి మార్చుకోండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు చంద్రబాబు. నాలుగు వేలు తీసుకున్న మహిళ కచ్చితంగా తనకు హెల్ప్ చేస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. 

పసుపు కుంకుమ లబ్దిదారులు తప్పకుండా చంద్రబాబుకు ఓటేస్తారని చెప్పొచ్చు. ఈ ఒక్క పథకమే తనను కాపాడుతందని చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచారం. తమను ఇంతగా ఆదుకునేలా సంక్షమే కార్యక్రమాలు రూపొందిస్తున్న చంద్రన్నే మళ్లీ విజయమంటూ కోరుకుంటున్నారు చంద్రబాబు అనుచరులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: