రాష్ట్రంలో వైసీపీని గెలిపించి అధికారంలోకి తెస్తే.. రాష్ట్ర అభివృద్ధిలో విప్లవం తీసుకువస్తానని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఆయన విశాఖ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గాజువాక ప్రాంతంలో పర్యటించిన జగన్.. ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డిని గెలిపించాలని కోరారు. 


జగన్ ఇంకా ఏమన్నారంటే... 
"నాగిరెడ్డి అన్నపై ఇక్కడ పోటీగా ఓ యాక్టర్ నిలుచున్నారు.. ఆయన సినిమా యాక్టర్ కావచ్చు.. కానీ నాగిరెడ్డి అన్న లోకల్ హీరో.. మీకు ఏ సమస్య వచ్చినా ఇక్కడే ఉండి అండగా నిలబడతాడు. గత తొమ్మిదేళ్లుగా ఇక్కడ మీకోసం ఎన్నో కేసులు పెట్టించుకుని పోరాడాడు. 

ఎలాంటి ప్రజాసమస్య ఉన్నా స్పందించి పోరాడే వ్యక్తి నాగిరెడ్డి. ఇక ఇక్కడ పోటీ చేస్తున్న సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్ గురించి చెప్పాలంటే.. ఆయన నామినేషన్‌ పేపర్లలో పసుపు జెండాలు కనిపిస్తున్నాయి. నాలుగున్నరేళ్లు చంద్రబాబుతో కాపురం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్.. 

నేను తొమ్మిదేళ్లుగా చంద్రబాబుపై పోరాటం చేస్తుంటే ఆయన నా పై పెట్టిన కేసులు 21.. కానీ ఇదే పవన్ కల్యాణ్ పై చంద్రబాబు పెట్టిన కేసులన్నో తెలుసా.. పెద్ద గుండు సున్నా.. ఈ లెక్కలు చూస్తేనే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో అర్థమవుతుంది. నాగిరెడ్డి అన్నను తప్పకుండా  గెలిపించండి.. "



మరింత సమాచారం తెలుసుకోండి: