నటుడు సినీ రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల శివాజీరాజా వైసిపి పార్టీ అధినేత జగన్ నీ కించపరచాలని ప్రజలలో ఆయనకి ఉన్న నమ్మకాన్ని తొలగించేలా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని శివాజీ రాజా పై మండిపడ్డారు పోసాని కృష్ణ మురళి. మొన్నటి వరకు చంద్రబాబు దయ్యమని అంటున్న శివాజీ రాజా తాజాగా ఎన్నికల ముందు చంద్రబాబు దేవుడు ఎలా అయ్యాడు అని ప్రశ్నల వర్షం కురిపించారు పోసాని కృష్ణ మురళి.


రాబోయే ఎన్నికలలో ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు కి ఓటు వేస్తే ఒక సామాజిక వర్గానికి మరియు సామాజిక రాష్ట్రానికి ఓటు వేసినట్లు అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్ కి ఎలా వెన్నుపోటు పొడిచారో అదేవిధంగా జగన్ పై కేసులు పెట్టించారని..పోసాని అన్నారు. చంద్రబాబుకి ఉన్నత కుల పిచ్చి మరెవ్వరికీ లేదని చంద్రబాబుకు ఓటు వేస్తే ఒక సామాజిక వర్గానికి ఓటు వేసినట్లు అని...అసలు దళితులు లాగా ఎవరైనా కొట్టాలని కోరుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అని ఇటువంటి దుర్మార్గుడు కుల పిచ్చి ఉన్న నాయకుడు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు ఏవిధమైన మేలు చేకూరుతుందని ప్రశ్నల వర్షం కురిపించారు.


ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో క్రెడిబులిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అతనికి ఒక్కసారి ఓటు వేస్తే మరొకసారి ఓట్లు అడిగించుకునే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.ప్రత్యేక హోదా రాకపోతే ఊరి వేసుకుంటా సమైక్యాంధ్ర కోసం చచ్చిపోతా అన్న వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు కి మద్దతు తెలుపుతూ పిచ్చి పిచ్చి మీడియా సమావేశాలు పెడుతూ ప్రజల ఆలోచనా ధోరణి తప్పుదోవ పట్టించే విధంగా జగన్ గురించి నీచంగా శివాజీ రాజా ప్రవర్తిస్తున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని..


రెండు తెలుగు రాష్ట్రాలలో సమైక్యాంధ్ర కోసం మరియు ప్రత్యేక హోదా కోసం నీతిగా నిజాయితీగా పోరాడిన ఏకైక రాజకీయ నాయకుడు జగన్ అని..ఎన్నికల ముందు ఇటువంటి కుట్రలు ఇంకా ఎక్కువ ఉంటాయని జగన్ పై శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని శివాజీ రాజా కి కుల పిచ్చి ఉందని చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అలా వ్యవహరిస్తున్నారని...ప్రజలంతా అప్రమత్తంగా ఉండి రాబోయే ఎన్నికల్లో నీతిగా నిజాయితీగా క్రెడిబులిటీ కలిగిన పొలిటిషన్ గా ఉన్న జగన్ ని గెలిపించుకోవాలని సూచించారు పోసాని కృష్ణమురళి.



మరింత సమాచారం తెలుసుకోండి: