వైసిపి పార్టీ మద్దతుదారుడు సినీ ఇండస్ట్రీ సీనియర్ రచయిత పోసాని కృష్ణ మురళి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన పోసాని కృష్ణ మురళి చంద్రబాబు అంత నీచమైన దుర్మార్గమైన రాజకీయ నాయకుడు దేశ రాజకీయాలలోనే ఉండరు అని పేర్కొన్నారు. తనకు రాజకీయంగా ఎదురు వచ్చే వారిపై ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు చంద్రబాబు వెనుకాడరని...


సాక్షాత్తు టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు ప్రజల అన్న నందమూరి తారక రామారావు గారి భార్య అయిన లక్ష్మీపార్వతి పై ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తోక పత్రిక మరియు మీడియా చానళ్లు చాలా అసభ్యంగా కథనాలు ప్రసారం చేశాయని 60 ఏళ్ల వయస్సు ఉన్న ఆమె సెక్స్ కోరికలు కోరుతున్నట్లు చాలా నీచంగా చంద్రబాబు కి మద్దతు తెలిపే మీడియా చానళ్లు...పత్రికలు...రాశాయని... ప్రసారం చేశాయని విమర్శించారు.


ఇంతటి దారుణమైన చంద్రబాబు గతంలో ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి గారి కూతురు గురించి ఇదే పత్రికల్లో మీడియా ఛానళ్లలో నీచంగా కథనాలు ప్రసారం చేశారని అంత దారుణంగా వ్యవహరించిన చంద్రబాబుతో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం సిగ్గుచేటు అంటూ...


పవన్ కళ్యాణ్ ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి ఈ విషయం గుర్తు చేస్తున్నానని అనవసరంగా చంద్రబాబుతో చేతులు కలిపి క్యారెక్టర్ కలిగిన పొలిటిషన్ అయిన జగన్ పై పవన్ కళ్యాణ్ అనవసరమైన విమర్శలు చేయటం మంచిది కాదు అంటూ సూచించారు. విలువలు వ్యక్తిత్వం విశ్వసనీయత కలిగిన నాయకుడు రాజకీయాలలో ఉన్న ఏకైక నాయకుడు వైసీపీ అధినేత జగన్ అని అతను తప్పు చేశాడని పవన్ కళ్యాణ్ నిరూపిస్తే పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేసి అతని ఫోటో మెళ్ళో వేసుకుని తిరుగుతానని పేర్కొన్నారు పోసాని కృష్ణ మురళి.



మరింత సమాచారం తెలుసుకోండి: