పాపం .. టీడీపీని గెలిపించడానికి చంద్రబాబు ఎంతగా కష్టపడుతున్నాడో .. పచ్చ మీడియా కూడా అదే మాదిరిగా కష్ట పడుతుంది. చంద్రబాబు గెలిస్తే ఆ ఆరు మీడియా హౌస్ లూ గెలుస్తాయని, కొన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించుకోవడానికి ఆ మీడియా వర్గాలు తెలుగుదేశం పార్టీ కోసం అంతలా కష్ట పడుతూ ఉన్నాయని..కులం, ధనం అనే సమీకరణాలతోనే ఆ మీడియా వర్గాలు మొత్తం ఏపీ ప్రజలకు కళ్లకు గంతలు కడుతూ ఉన్నాయనే విశ్లేషణలు కొత్తవి ఏమీ కావు.


అయినప్పటికీ ఆ చానళ్ల తీరు ఏమీ మారడం లేదు. అలానే సాగుతూ ఉంది. అందులో భాగంగా సర్వేలను కూడా విడుదల చేయడం మొదలైంది. అయినా పాపం ఆ సర్వేలను నమ్మే నాధుడే లేదు. అయితే పోసాని .. మాట్లాడుతూ శివాజీ చెప్పిన మాట్లాడు ఏవైతే ఉన్నాయో టీవీ 9 రవి ప్రకాష్, రాధాకృష్ణ , శివాజీ అందరూ కమ్మోళ్ళు కాబట్టి జగన్ మీద రవి ప్రకాష్ కొన్ని కారణాల వల్ల గొడవలు ఉన్నాయని జగన్ తాట తీస్తామని చెప్పిన శివాజీ మీద పోసాని విరుచుకుపడ్డాడు. 


గరుడ పురాణంతో చంద్రబాబు తో చేతులు కలిపిన శివాజీ రోజుకొక మాట పూటకొక మాట మాట్లాడుతూ, కాసేపు చంద్రబాబును పొగడటం, కాసేపు తిట్టడటం ఇదంతా ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించాడు. ఇలాంటి డబుల్ నాటకం గల వాళ్లను మీడియా కూడా ప్రశ్నించాలని చెప్పాడు. అయితే రాధాకృష్ణ .. ఎన్టీఆర్ ను వాడు, వీడు అంటూ మాట్లాడుతూ పథకాలకు పేరును తొలగించాలను మాట్లాడిన మాటలు రికార్డు అయినా సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: