జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీనటుడు అలీ పై చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపాయి. అలీ మొదట్లో జనసేనలో చేరతాడని అంతా అనుకున్నారు.. కానీ ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. 


అలీ వైసీపీలో చేరినా ఆ విషయంపై పవన్ ఇప్పటివరకూ పెద్దగా కామెంట్ చేయలేదు. కానీ తాజాగా రాజమండ్రి సభలో పవన్ ఘాటుగా స్పందించారు. ఎంతో సాయం చేసిన అలీ వైసీపీలో చేరాడు. పవన్ గెలవడు.. జగన్ గెలుస్తాడు అన్నదే కారణం కావచ్చు అన్నారు. 

దీనిపై అలీ చాలా ఆవేదనగా .. అదే సమయంలో ఘాటుగానూ స్పందించాడు. అలీ ఏమన్నారంటే.. మీరు పార్టీ పెట్టిన మొదట్లో నేను మీదగ్గరకు వచ్చి ఏం చెప్పానో గుర్తు చేసుకోండి.. సినిమాల్లోగానే మీరు రాజకీయాల్లోనూ ఉన్నత శిఖరం చేరాలని కోరా..

ఆరోజు నేను మీకు బహుమతిగా ఖురాన్ ఇచ్చాను.. ఖర్జూరాలు తెచ్చాను. కానీ ఇప్పుడు మీరు.. నేను పుట్టిన ఊరికి వెళ్లి నన్ను బద్నామ్‌ చేస్తారా.. అంటూ సున్నితంగానే ఘాటైన విమర్శలు చేశారు. మీరు ఇంకెక్కడ మాట‌్లాడినా నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాదు.. కానీ రాజమండ్రిలో మాట్లాడారు. అందుకే నేను ఈ సమాధానం ఇస్తున్నా.. అన్నారు అలీ..



మరింత సమాచారం తెలుసుకోండి: