జనసేన విజయం కోసం మెగా హీరోలు కదలి వస్తున్నారు. ఒక్కొక్కరుగా అడుగులు వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ పెద్దగా స్పందించని హీరోలు ఇప్పుడు ప్రచారం పీక్ లెవల్లో ఉన్న సమయంలో ముందుకొచ్చారు. 


పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లోనూ.. ఆయన సోదరుడు నాగబాబు నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగబాబు కూతురు నిహారిక, ఆయన తనయుడు వరుణ్ తేజ్ నరసాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. 

రామ్ చరణ్ కూడా జనసేన తరపున ప్రచారం చేసేందుకు ఏపీకి వచ్చారు. రామ్ చరణ్ గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో ప్రచారానికి సిద్దమయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రచారం లోపాల్గొంటున్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన
జనసే ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్, నాగబాబులతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడ పాల్గొన్నారు.

ఇటీవల అల్లు అర్జున్.. తన మిత్రుడైన ఓ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా  ఓపెన్ లెటర్ రాయడం వివాదానికి దారి తీసింది. జనసేనకు కాదని వైసీపీకి మద్దతు ఇవ్వమని ఎలా లెటర్ రాస్తారని ఫ్యాన్స్ ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ప్రచారానికి రావడం మెగా ఫ్యాన్స్ ను ఉత్తేజ పరిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: