గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి.. ఈ రెండు పేర్లూ చెబితే ముందుగా గుర్తొచ్చేది వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి. జీవిత ఖైదు శిక్షపడి జైలులో ఉన్న గౌరు వెంకటరెడ్డిని వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయక బయటకు తెచ్చారు. 


అయితే..అప్పటి నుంచి ఆ కుటుంబం వైఎస్‌ వెంటే నడుస్తోంది. జగన్ వచ్చాకా అది కొనసాగింది. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా పాణ్యం నుంచి ఈమె గెలిచారు. ఐతే.. ఈసారి గౌరు కుటంబం పాణ్యంలో గెలిచే పరిస్థితులు లేవు. ఈవిషయం సర్వే ద్వారా నిర్థారించుకున్న జగన్ అసెంబ్లీ టికెట్ వేరేవారికి ఇచ్చేశారు. 

దీంతో  గౌరు కుటుంబం టీడీపీలోకి వెళ్లి అదే పాణ్యం నుంచి టికెట్ తెచ్చుకుంది. ప్రస్తుతం గౌరు చరిత పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమె తాజాగా ఎన్నికల ప్రచారంలో సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పిన తర్వాత.. చివరల్లో జై జగన్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. 

ఆ తర్వాత అసలు విషయం గుర్తించి.. నాలిక కరుచుకున్నారు. జై చంద్రబాబు అంటూ బలవంతంగా నినాదం చేశారు. పాపం.. ఇన్నాళ్లూ జైజగన్ అనడం అలవాటై.. ఒక్కసారిగా మారాలంటే మారుతుందా.. చరత జై జగన్ అనడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: