మంగళగిరి.. ఇప్పుడు అందరి కళ్లూ ఈ నియోజక వర్గం వైపే.. భవిష్యత్‌లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు,  మంత్రి నారా లోకేశ్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇది. ఈ ఎన్నికల్లో లోకేశ్ ఓడితే.. అది టీడీపీకే అవమానం అవుతుంది. 


అయితే ఈ స్థానంలో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ నేత ఆళ్ల రామకష్ణారెడ్డి 12 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే ఈ సారి బలమైన ప్రత్యర్థి నిలబడం వల్ల ఆళ్ల గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.  

లోకేశ్ మీద గెలిస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని భరోసా ఇస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఆయన కు తన మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తానని మంగళగిరిలో జరిగిన భారీ బహిరంగ షభలో జగన్ చెప్పారు. ఆర్కేను  గెలిపిస్తే మంగళగిరిలో మీ ఆస్తులను కాపాడతారని, లోకేష్ ను గెలిపిస్తే మీ ఆస్తులు ఏమి అవుతాయో తెలియదని జగన్ అన్నారు. 

లోకేష్, చంద్రబాబు ఇక్కడి ప్రజలను భూముల సేకరణ పేరుతో ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశామని జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిని ప్రతి కుంభకోణం.. మోసం.. వంచన అన్ని మంగళగిరి కేంద్రంగానే జరిగాయన్నారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుందని, ఆయన సుపుత్రుడు లోకేష్‌ను కూడా ఓడించాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: