ఏపీ ప్రచారం ముగింపు దశకు వచ్చేసరికి చంద్రబాబు కేసీఆర్‌ పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నాడు. కేసీఆర్.. ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండు.. నా జోలికొస్తే నీ తాట తీస్తా.. అంటూ ఫైర్ అవుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు.నా జోలికొస్తే తాటతీయటమే కాదు.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


కేసీఆర్.. నీ మాదిరిగా నేను నోటికొచ్చినట్లుగా మాట్లడను..  అంటూనే తాట తీస్తానంటూ అదేస్థాయిలో రెచ్చిపోయారు చంద్రబాబు. నీకు, నరేంద్రమోడీకి బుద్ధి రావాలంటే.. నీ భాష వాడితే తప్ప బుద్ధి రాదు అంటూ కామెంట్ చేశారు. 100 మంది నరేంద్రమోడీలు, 500 మంది కేసీఆర్ లు, వెయ్యి కోడి కత్తులు వచ్చినా ఏం చేయలేరన్నారు.

చంద్రబాబు ప్రసంగాలు చూస్తుంటే.. గతంలో వైఎస్ జగన్ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చేసిన ప్రసంగాలు గుర్తుకువస్తున్నాయి. అప్పుడు జగన్ అలాగే రెచ్పిపోయి ప్రసంగించారు. చంద్రబాబును అన్న కాదు దున్న అన్నారు. అంతే కాదు.. ఇలాంటి వ్యక్తిని చంపేసినా పాపం లేదన్నారు. 

ఇలాంటి ప్రసంగాలను జనం ఆమోదించరు.. అందుకే వైఎస్ జగన్ ప్రచారం చేసినా నంద్యాల ఉపఎన్నికలల్లో ఆ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు సేమ్ సీన్ ఏపీలో కనిపిస్తోంది. దాదాపు నెల రోజులుగా చంద్రబాబు రోజూ కేసీఆర్ పై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. మరి ఈసారి ఆంధ్రా ప్రజలు ఏం చేస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: