ఎన్నికలు ముగిశాక.. ఓ పార్టీకి మెజారిటీ వచ్చాక.. ఓడిపోయిన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీలోకి జంప్ కావడం ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది టీడీపీలో చేరిపోయారు. చాలా మంది మంత్రులు కూడా అయ్యారు. 


తెలంగాణలోనూ సేమీ సీన్ రిపీటైంది. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఓ కొత్త సీన్ ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ నుంచి పోటీ చేసిన ఓ అభ్యర్థి నన్ను గెలిపించండి ప్లీజ్‌.. అని ఓట్లు అడుగుతున్నారు. తనను గెలిపిస్తే వెంటనే వైసీపీలో చేరిపోతాను నన్ను నమ్మండి ప్లీజ్ అంటున్నాడు. 

ఎందుకంటే సదరు అభ్యర్థి ప్రచారానికి వెళ్లినప్పుడు.. జనం ఎలాగూ జగన్‌ సీఎం అవుతాడు కదా.. నిన్ను ఇక్కడ గెలిపించి ఏం ప్రయోజనం అని అడుగుతున్నారట. దాంతో ఈ టీడీపీ అభ్యర్థి ఇలా వెరైటీ వాదన వినిపిస్తున్నాడట. నేను గెలిచినా టీడీపీలో ఉండను.. జగన్ గెలిస్తే.. వెంటనే వైసీపీలో చేరిపోతా అని జనానికి చెబుతున్నాడట. 

ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరా అనుకుంటున్నారా.. ఆయనే కనిగిరిలో టీడీపీ తరపున పోటీకి దిగిన ఉగ్రనరసింహారెడ్డి.. ఈ సీటు వాస్తవానికి కదిరి బాబూరావు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన పోటీ చేస్తే గెలవదని తెలుసుకున్న బాబు.. బాలయ్య చెప్పినా వినకుండా ఉగ్రనరసింహారెడ్డికి ఇచ్చారు. ఈయనేమో ఇలా ప్రచారం చేసుకుంటున్నాడు. భలే చిత్రంగా ఉంది కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: