వే 2 న్యూస్.. మొబైల్‌ లో వార్తలు చదివే వారికి బాగా పరిచయమైన పేరు. ఏ వార్తనైనా సంక్షిప్తంగా సింపుల్ గా చెప్పే  ఈ యాప్ తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయ్యింది. దేశంలోని అన్ని భాషల్లోనూ సర్వీసులు అందిస్తోంది. 


ఈ సంస్థ మొన్నటి తెలంగాణ ఎన్నికల్లోనూ సర్వే నిర్వహించింది. మహా కూటమి గెలుస్తుందని లగడపాటి సహా పలు సర్వేలు చెప్పినా.. ఈ వే టూ న్యూస్ సంస్థ మాత్రం పక్కగా  తెలంగాణ రిజల్ట్స్ ను ముందే అంచనా వేసింది. 

 ఆ సంస్థ ఇప్పుడు ఏపీ ఎన్నికలపైనా డిజిటల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పింది. ఈ సర్వే సంస్థ నిర్వహించిన డిజిటల్ సర్వేలో  దాదాపు 4 లక్షల మంది పాల్గొన్నారట. ఈ సర్వేలో  55 శాతం మంది జనం వైసీపీకే ఓటేస్తామని చెప్పారు. 

ఈ సర్వేలో టీడీపీకి ఓటేస్తామన్న వారి సంఖ్య కేవలం 30 శాతం ఉండటం విశేషం. ఇంతవరకూ ఏ సర్వేలోనూ ఇంత తేడా రాలేదు. ఇక కొత్తగా ఓటు వచ్చిన యువ ఓటర్లు ఎక్కువ మంది  జనసేన వైపు మొగ్గుతున్నారని ఈ సంస్థ చెప్పింది. ఈ సర్వేను ఏప్రిల్ 4-8 తేదీల మధ్య నిర్వహించారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: