నటుడు శివాజీని ఏపీ సీఎం చంద్ర బాబు ఫాలో అవుతున్నారు. నటుడు శివాజీ ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ మొదట ప్రారంభించి ఆ తర్వాత క్రమంగా తెలుగుదేశం కార్యకర్తగా మారిపోయాడని వైసీపీ ఆరోపిస్తుంది. ఆయన చర్యలు కూడా ఆ వాదనను సపోర్ట్ చేసే విధంగానే సాగాయి. 


మొదట ఆపరేషన్ గరుడ అంటూ మీడియా దృష్టిని ఆకర్షించిన శివాజీ.. ఆ తర్వాత రకరకాల పేర్లతో మీడియా ముందుకు వచ్చారు. చివరకు ఆయన రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తి కాదని.. సీఎం చంద్రబాబు కోసం పనిచేసే వ్యక్తి అని అంతా గ్రహించే రేంజ్‌కు చేరిపోయారు. 

ఇక ఆయన తన చివరి ప్రయత్నంగా మొన్న విజయవాడలో మీడియా ముందుకు వచ్చారు. సాధారణంగా ప్రెస్ మీట్ పెడితే పెద్దగా ఎఫెక్ట్ ఉండటం లేదని భావించిన ఆయన ఈసారి వీడియో ప్రజంటేషన్‌ ఇచ్చారు. పోలవరం, అమరావతి, శ్రీసిటీ ఎలా ఉన్నాయో చూపిస్తూ వివిధ నాయకుల వీడియో క్లిప్పింగులు చూపిస్తూ మొత్తానికి చంద్రబాబుకు ఓటేయమని సలహా ఇచ్చారు. 

ఇప్పుడు చంద్రబాబు కూడా సేమ్ శివాజీని ఫాలో అయ్యారు. రాష్ట్రమంతటా ప్రచారం ముగుస్తున్న చివరి నిమిషాల్లో ఆయన అనూహ్యంగా తెరపైకి వచ్చారు. అరగంట సేపు శివాజీ తరహాలోనే వీడియో ప్రదర్శన చేసి చూపించారు. వైసీపీ వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందంటూ హెచ్చరించారు. తనకే ఓటేయాలని అభ్యర్థించారు. మొత్తానికి చంద్రబాబు వంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీనేత చిన్నపాటి నాయకుడు శివాజీని ఫాలో అవుతూ ఆయన్ను హీరో చేశారని ఆంధ్రప్రజ గుసగుసలాడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: