సోమవారం రాత్రి చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీనటుడు, వైసిపి నాయకుడు డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ, వైఎస్ జగన్ పై 31 కేసులు ఉన్నాయంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్న నికృష్ణుడు చంద్రబాబు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ చావుకు కమ్మవాడయిన చంద్రబాబు కారణం కాదా? కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఆయన ఆటలిక సాగవని శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత, సినీనటుడు, వైసిపి నాయకుడు డాక్టర్ మోహన్ బాబు ధ్వజమెత్తారు. వెన్నుపోటుదారుడు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడని అన్నారు.
"మన ప్రాంతంలో కమ్మవాళ్లు పూర్తిగా చంద్రబాబు మాయలో పడ్డారని, ఒక దొంగ, వెన్నుపోటు దారుడిని నమ్మితే మన ఉరి మనమే వేసుకున్నట్లు" అని మోహన్ బాబు అన్నారు. కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ అంటూ కులాలు కాకుండా కుల,మతాలకు అతీతంగా వెళ్తున్న వైఎస్ జగన్మోహనరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ దేశం లోనే ఎవరూ చేయలేని సంక్షేమ పథకాలను అందించాడని, ఆ పథకాలను సమర్థవంతంగా నిర్వహించే ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహనరెడ్డి అని అన్నారు.
"గత ఎన్నికల సమయంలో ప్రతి అక్క చెల్లెమ్మలకు ₹32000 /- ఇస్తానన్న ఈ అబద్దాల కోరు, ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తుండడంతో ₹10000/- లను మాత్రమే మూడు విడతలుగా ఇచ్చి, మిగిలిన ₹22000/- లను తన కుమారుడు నారా లోకేశ్ ఖాతా లోకి జమ చేయలేదా?" అని మోహన్ బాబు ప్రశ్నించాడు. ప్రజల కోసం, అభివృద్ధి కోసం సైనికుడి లా కష్టపడే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, చంద్రబాబు నీచ నికృష్ట రాజకీయాలపై డప్పులు వాయించి మరీ మోహన్ బాబు దండోరా వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికైపోయినట్లెనని, వైసీపి ఒక ప్రభంజనంలా 130 శాసనసభా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రానున్నదని మోహన్ బాబు జోస్యం చెప్పారు. చంద్రబాబు తన ‘ఎల్లో మీడియా’ ద్వారా అబద్ధపు ప్రచారాలు చేయించుకుని, ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తు న్నాడని అన్నారు. చంద్రబాబు శేషజీవితం జైల్లో గడుపుకోవాల్సిందేనని చెప్పారు.
కాగా, 1968 లో తనకు అన్నం పెట్టి చెన్నైలో సాయంచేసి,
ఉపాధ్యాయుడు కావడానికి కారణమైన విశ్రాంత ఉపాధ్యాయుడు యూసఫ్ను వేదికపైకి పిలిపించి
మోహన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.