వై.ఎస్. షర్మిల చివరిరోజు ఎన్నికల ప్రచారంలో కొత్త కొత్త సెటైర్లతో ఫ్యాన్స్ ను అలరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆమె ప్రచారానికి జనం బ్రహ్మరథం పట్టారు. రోడ్‌ షోకు వచ్చిన ఆ జనాన్ని చూసి షర్మిల కూడా హుషారుగా సెటైర్లు వేశారు. 


సాధారణంగా లోకేశ్‌ ను షర్మిల పప్పు పప్పు అంటూ కామెంట్ చేస్తుంటారు.. అయితే ఈ  ప్రచార సభలో ఒక అబిమాని జోక్యం చేసుకుని లోకేష్ పప్పు అయితే, తండ్రి చంద్రబాబు గన్నేరు పప్పు అంటూ కామెంట్‌ చేశారు. ఈ కామెంట్ షర్మిలకు బాగా నచ్చేసింది. అంతే.. వేదికపైనే ఆ విషయం ప్రకటించేసింది. 

లోకేశ్‌కు పొట్టకోస్తే అక్షరమ్ముక్కరాదని.. వర్థంతికి జయంతికీ తేడా తెలియదని..అలాంటి వ్యక్తికి మూడు శాఖలిచ్చి మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. కొడుకేమో పప్పు, తండ్రేమో గన్నేరు పప్పు అని అందరు అనుకుంటున్నారు అంటూ ప్రజలను ఉత్తేజపరిచారు. జగనన్నే కాబోయే ముఖ్యమంత్రి అని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. 

వైఎస్సార్‌సీపీ మీద చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. తమకు ఎవరితోనూ పొత్తులేదని ఆ అవసరం కూడా లేదని కుండబద్దలు కొట్టారు. సింహం సింగిల్‌గానే వస్తుంది. జగనమోహన్‌రెడ్డిగారు సింగిల్‌గానే బంపర్‌ మెజారిటీతో గెలుస్తారని సర్వేలన్నీ చెప్తున్నాయి. నక్కలే గుంపులుగా వస్తాయి.. అంటూ విమర్శల వర్షం కురిపించారు షర్మిల. 



మరింత సమాచారం తెలుసుకోండి: