అదేంటి.. ఎన్నికల ప్రచారం ముగిసింది కదా..ఇంకా ప్రచారమేంటి.. అందులోనూ రాజకీయాలకు దూరంగా ఉండే సినీనటి సమంత ప్రచారం చేయడమేంటి.. అనుకుంటున్నారా.. ప్రచారం అంటే డోర్ టు డోర్ ప్రచారమో.. రోడ్‌షో ప్రచారమో కాదు లెండి. 


జస్ట్ తన సోషల్ మీడియా ద్వారా ఫలానా వాళ్లుకు ఓటేయండి అని సూచించడమే.. అయితే ఇది తక్కువ ప్రభావం ఏమీ చూపించదు. ఎందుకంటే.. సమంత వంటి సెలబ్రెటీలను ఫాలో అయ్యేవారు కోట్లలో ఉంటారు కదా. మరి ఇంతకీ సమంతా ఎవరికి ఓటేయమని చెబుతుందో తెలుసా.

రేపెల్లె టీడీపీ అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటును వేసి బారి మెజారిటీతో గెలిపించండి అంటూ  సమంత చెబుతున్నట్లు ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుంటూరు జిల్లా రేపెల్లె అసెంబ్లీ స్థానం నుంచి సత్యప్రసాద్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు.  సైకిల్ గుర్తుకే మీ ఓటు.. నా పూర్తీ మద్దతు సత్యప్రసాద్ గారికే అంటూ సమంత వీడియోలో వివరణ ఇచ్చింది. 

అయితే.. ఈ సత్యప్రసాద్ కు సమంత ఎలా పరిచయం.. ఇదేగా మీ సందేహం.. ఈ ప్రశ్న ఒక అభిమాని అడిగాడు. అందుకు సమంతా ఆయన తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపింది. ఆయన సోదరి డాక్టర్ మంజుల కూడా సమంతాకు మంచి స్నేహితురాట. అదీ సంగతి.. బావుంది.. ఆ మధ్య నాగార్జున జగన్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.. ఇప్పుడు కోడలు టీడీపీ అభ్యర్థికి ఓటేయమంటోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: